News July 4, 2024
రాణించిన ఉతప్ప.. ఇంగ్లండ్ చిత్తు

వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో 3వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాబిన్ ఉతప్ప 50 పరుగులతో(32 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సులు) చెలరేగారు. గుర్క్రీత్(33), నమన్ ఓజా(25) రాణించగా కెప్టెన్ యువరాజ్(2 రన్స్) నిరాశపర్చారు.
Similar News
News January 12, 2026
డీఏపై జీవో విడుదల

TG: ప్రభుత్వ ఉద్యోగుల <<18837053>>డీఏ 3.64%<<>> పెంచుతూ సర్కారు జీవో విడుదల చేసింది. 2023 జులై 1 నుంచి ఇది వర్తించనుంది. పెరిగిన డీఏ జనవరి నెల వేతనంతో కలిపి ఫిబ్రవరి 1న చెల్లించనున్నారు. 2023 జులై 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు డీఏ బకాయిలు GPF ఖాతాలో జమ చేయనున్నారు. మున్సిపాలిటీ ఉద్యోగుల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకు అందరి జీతాలు పెరగనున్నాయి.
News January 12, 2026
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డులు విడుదల

ఆలిండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. వాటిని <
News January 12, 2026
ప్రభుత్వ సేవలన్నీ మనమిత్ర ద్వారానే అమలవ్వాలి: కాటమనేని

AP: అంతరాయం లేకుండా ప్రభుత్వ సేవలు అందించేందుకు అన్ని శాఖలు మనమిత్ర యాప్ ద్వారా వాటిని అమలు చేయాలని IT కార్యదర్శి కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు. ‘కొన్ని శాఖలు ఇప్పటికీ మాన్యువల్గా సేవలు కొనసాగిస్తున్నాయి. డేటా అనుసంధానం ప్రక్రియ పూర్తి చేసి యూజ్ కేసెస్ సిద్ధం చేస్తున్నాం. AI ఆధారితంగా ఉపయోగపడే 98 కేసెస్ను ఇప్పటికే సిద్ధం చేశాం. APR నాటికి పూర్తిగా వాటిని అందుబాటులోకి తెస్తాం’ అని తెలిపారు.


