News July 4, 2024

అల్లూరికి CM చంద్రబాబు నివాళి

image

AP: భారత స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. గిరిజన, తాడిత పీడిత ప్రజలను స్వాతంత్ర్య సంగ్రామానికి సమాయత్తం చేసిన ఆ మహనీయుడి స్పూర్తితో మనం పురోగమించాల్సిన అవసరం ఇప్పటికీ ఉందని అభిప్రాయపడ్డారు. సమసమాజ స్థాపనకు అల్లూరి చూపిన బాట మనకు ఆదర్శప్రాయమని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News April 1, 2026

యంగ్ హీరోలతో బాలయ్య పోటీ.. మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్!

image

బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో మూవీ చేస్తుండగా, ఆ తర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దసరాకు షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే విజయ్ కనకమేడల చెప్పిన కథకూ బాలయ్య ఓకే చెప్పినట్లు సమాచారం. ఇది 2027 ఆరంభంలో పట్టాలెక్కనుందని టాక్. నాంది, భైరవం, ఉగ్రం చిత్రాలకు విజయ్ డైరెక్షన్ చేశారు.

News April 1, 2026

GK: భారతీయ రైల్వే – కీలక విషయాలు

image

*మొదటి రైలు: భారతదేశంలో మొదటి రైలు ఏప్రిల్ 16, 1853న ముంబై (బోరి బందర్) నుంచి థానే వరకు (34 కి.మీ) నడిచింది.
*రైల్వే జోన్లు: ప్రస్తుతం 19 రైల్వే జోన్లు ఉన్నాయి (మెట్రో రైల్ కోల్‌కతాతో కలిపి).
*అతి పొడవైన రైలు మార్గం: వివేక్ ఎక్స్‌ప్రెస్ – ఇది దిబ్రూగఢ్ (అస్సాం) నుండి కన్యాకుమారి (తమిళనాడు) వరకు ప్రయాణిస్తుంది.
*మొదటి విద్యుత్ రైలు: 1925లో ముంబై నుండి కుర్లా మధ్య నడిచిన డెక్కన్ క్వీన్.

News April 1, 2026

చందమామపైకి చిన్నారి బొమ్మ

image

దాదాపు 53 ఏళ్ల తర్వాత నాసా చేపట్టే మానవసహిత చందమామ యాత్ర (Artemis II) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మిషన్‌లో నలుగురు వ్యోమగాములతో పాటు ‘రైజ్’ అనే బొమ్మ కూడా ప్రయాణం చేయనుంది. దీన్ని కాలిఫోర్నియాకు చెందిన 8 ఏళ్ల లూకాస్ తయారు చేశాడు. 1961 నుంచి ఉన్న ‘జీరో గ్రావిటీ ఇండికేటర్’ సంప్రదాయం ప్రకారం వ్యోమగాములు ఓ బొమ్మను తీసుకెళ్తారు. ఈసారి 50 దేశాల నుంచి వచ్చిన 2,600 ఎంట్రీల్లో ఇది ఎంపికైంది.