News July 4, 2024
ముగిసిన గడువు.. ప్రత్యేక అధికారుల నియామకం

మండల పరిషత్లకు గురువారం, జిల్లా పరిషత్లకు శుక్రవారం గడువు ముగుస్తోంది. నల్లగొండ జిల్లా పరిధిలోని 31 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించామని నల్లగొండ జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ లకు ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక పాలన అధికారిని ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. 2019లో ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలను పునర్విభజన చేశారు.
Similar News
News March 11, 2025
NLG: 20 వరకు ప్రవేశానికి దరఖాస్తులు

తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కల విద్యార్థులు ఈనెల 20 లోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.
News March 11, 2025
నల్గొండ: ‘పరువు హత్యలు ఇకనైనా ఆగాలి!’

2018లో మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి జిల్లాలో ప్రణయ్ హత్య తర్వాత జరిగిన పరువు హత్యలు చర్చకు వస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకున్నాడని భువనగిరిలో రామకృష్ణను, ఇటీవలే సూర్యాపేటలో మాల బంటిని హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో అయినా పరువు హత్యలు జరగకుండా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
News March 11, 2025
ప్రణయ్ హత్య కేసులో వెనకడుగు వేయని పీపీ ‘దర్శనం నరసింహ’

2018లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసును వాదించడానికి అప్పట్లో లాయర్లు వెనకడుగు వేశారు. సీనియర్ న్యాయవాది దర్శనం నరసింహ ఈ కేసును వాదించడానికి ముందుకు వచ్చారు. దీంతో ప్రణయ్ తండ్రి పెరుమాండ్ల బాలస్వామి అభ్యర్థన మేర జిల్లా కలెక్టర్ 2019లో ఈ కేసును వాదించడానికి దర్శనం నరసింహను స్పెషల్ పీపీగా నియమించారు. ఈ కేసు తీర్పు సోమవారం వెలువడి ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు పడింది.