News July 4, 2024
వరంగల్ NIT విద్యార్థికి రూ.88 లక్షల ప్యాకేజీ

వరంగల్ NITలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్య్వూల్లో బీటెక్ (ECE) విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ దక్కింది. పంజాబ్లోని లుథియానాకు చెందిన రవిషా తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. కోడింగ్లో మెలకువలు, క్లబ్ల నుంచి అందిన మార్గదర్శకత్వం తనకు తోడ్పడ్డాయని రవిషా తెలిపారు. మరో 12 మంది రూ.68 లక్షల వార్షిక వేతన ప్యాకేజీలు లభించగా, 82 శాతం మంది బీటెక్ విద్యార్థులు ఉద్యోగం సాధించారు.
Similar News
News March 8, 2026
హుజూరాబాద్ సహాయ కార్మిక అధికారిణి D.చందన సస్పెన్షన్

హుజూరాబాద్ సహాయ కార్మిక అధికారిణి D.చందనను కార్మిక శాఖ కమీషనర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు సస్పెన్షన్ చేసినట్లు కార్మిక శాఖ వరంగల్ జోన్, సంయుక్త కార్మిక కమిషనర్ తెలిపారు. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల పెండింగ్, విధులకు గైర్హాజరు, అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై KNR ఉప కార్మిక కమీషనర్ విచారణ ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
News March 7, 2026
WGL: నేటి నుంచి ‘హెచ్పీవీ’ టీకాలు

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత టీకా(HPV) పంపిణీ జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభమైంది. 15 ఏళ్లలోపు బాలికల కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వర్ధన్నపేట, ఎంజీఎం, సీకేఎం ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్వో సాంబశివరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈ టీకా కోసం 9,824 మంది బాలికలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.
News March 7, 2026
WGL: పీఏసీఎస్ ఛైర్పర్సన్ నుంచి తెలంగాణ అధ్యక్షురాలిగా..!

వర్ధన్నపేటకు చెందిన స్వర్ణకు కాంగ్రెస్లో 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. 1991లో PACS ఛైర్పర్సన్గా తొలిసారి ఎన్నికయ్యారు. 2005లో వరంగల్ నగర మేయర్గా పని చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి MLAగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023 నుంచి 2025 వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేశారు. స్వర్ణ నియామకంతో ఓరుగల్లు రాజకీయాల్లో సమీకరణాలు మారనున్నాయి. వర్ధన్నపేట, వరంగల్ తూర్పులో రాజకీయం మరింత వేడెక్కనుంది.


