News July 4, 2024

నెలలో తిరిగిచ్చేస్తానంటూ చోరీ చేసిన దొంగ!

image

ఇంట్లో ఆరోగ్య చికిత్స కోసం తప్పట్లేదని, దోచుకున్న సొత్తును నెలరోజుల్లో తిరిగిచ్చేస్తానని ఉత్తరం రాసి మరీ ఓ దొంగ చోరీ చేయడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. తిరుచ్చెందూర్‌కు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి కుటుంబం గత నెల చెన్నై వెళ్లింది. ఈ నెల 1న తిరిగొచ్చాక ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తులో దొంగ రాసిన ఉత్తరాన్ని పోలీసులు గుర్తించారు.

Similar News

News October 13, 2024

RTC ప్రయాణికులకు షాక్.. బస్సులు తక్కువ, ఛార్జీల పెంపు!

image

TG: దసరా పండుగకు స్వగ్రామాలకు వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చే వారికి చుక్కలు కనబడుతున్నాయి. వరంగల్ తదితర నగరాల నుంచి తగినన్ని బస్సులు లేకపోవడంతో బస్టాండ్ల వద్ద గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇక ఛార్జీలను మరోసారి పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. ఉప్పల్ నుంచి తొర్రూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ బస్సుకు OCT 9న రూ.270 వసూలు చేయగా, ఇవాళ తొర్రూర్ నుంచి ఉప్పల్ వరకు రూ.320 వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

News October 13, 2024

పూరీ ఆలయంలో భక్తులకు ఉచితంగా ప్రసాదం!

image

పూరీ జ‌గ‌న్నాథుడి ఆల‌యంలో భ‌క్తుల‌కు ఉచితంగా మ‌హాప్ర‌సాదాన్ని పంపిణీ చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణయం తీసుకుంటామ‌ని మంత్రి పృథ్వీరాజ్ తెలిపారు. దీని వ‌ల్ల ఏటా ₹14-15 కోట్ల భారం ప‌డుతుంద‌న్నారు. అయితే, ఉచితంగా ప్ర‌సాదం పంపిణీకి విరాళాలు ఇవ్వ‌డానికి కొంత మంది భ‌క్తులు ముందుకొచ్చిన‌ట్టు వెల్లడించారు. కార్తీక మాసం తరువాత అమలు చేసే అవకాశం ఉన్నట్టు మంత్రి తెలిపారు.

News October 13, 2024

రేపు మద్యం దుకాణాలకు లాటరీ

image

AP: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు అందాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ఖజానాకు రూ.1,797 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువ దరఖాస్తులు రావడంతో దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. రేపు లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తారు. ఎల్లుండి ప్రైవేట్ వ్యక్తులకు దుకాణాలు అప్పగిస్తారు. 16 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది.