News July 4, 2024
VZM: మార్కెట్లో సెంచరీ కొట్టిన మిరప

మార్కెట్లో మిరప మరింత ఘాటెక్కింది. స్థానిక రామభద్రపురం కూరగాయల మార్కెట్లో గత నెల కిలో రూ.30 ఉన్న మిర్చిని ప్రస్తుతం రూ.100కు వ్యాపారులు అమ్ముతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మిరపకు తెగుళ్లు సోకి, పంట పాడైపోవడంతో గిరాకీ పెరిగిందని రైతులు చెబుతున్నారు. ఒకే సారి భారీగా పెరిగిపోవడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
Similar News
News March 16, 2026
VZM: నేడే పదవ తరగతి పరీక్షలు

నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని 119 కేంద్రాల్లో 23,529 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉ.9:30 నుంచి మ.12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. హాల్ టికెట్పై సంబంధిత స్కూల్ ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా అనుమతించనున్నట్లు వెల్లడించారు. హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. సందేహాలు ఉంటే 7382157686 ఫోన్ చేయవచ్చు. ఆల్ ది బెస్ట్.
News March 16, 2026
భోగాపురం కనెక్టివిటీ రోడ్ల క్లియరెన్సుకు సీఎం ఆదేశం: మంత్రి నారాయణ

భోగాపురం కనెక్టివిటీ రోడ్లకు అటవీ శాఖ నుంచి క్లియరెన్సులు ఇవ్వాలని సీఎం ఆదేశించారని మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖలో మెట్రో రైలు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టుపై మరోసారి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరిందని, రైటర్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఆలస్యం లేకుండా టెండర్ల ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు.
News March 16, 2026
భోగాపురం కనెక్టివిటీ రోడ్ల క్లియరెన్సుకు సీఎం ఆదేశం: మంత్రి నారాయణ

భోగాపురం కనెక్టివిటీ రోడ్లకు అటవీ శాఖ నుంచి క్లియరెన్సులు ఇవ్వాలని సీఎం ఆదేశించారని మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖలో మెట్రో రైలు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టుపై మరోసారి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరిందని, రైటర్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఆలస్యం లేకుండా టెండర్ల ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు.


