News July 4, 2024
రామచంద్రాపురం: జాతరలో కరెంట్ షాక్తో వ్యక్తి మృతి

రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం గంగమ్మ జాతరలో అపశృతి చోటుచేసుకుంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి గంగమ్మ ఆలయంలో విద్యుత్ షాక్కు గురై శానంపూరి గోపి(40) తీవ్రంగా గాయపడ్డారు. అతడిని కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే చనిపోయాడని డాక్టర్ నిర్దారించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 28, 2025
చిత్తూరు: మీ ఊర్లో కరెంట్ సమస్యలు ఉన్నాయా.?

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. జిల్లాలో మొదటిసారి కార్యక్రమాన్ని సీఎండీ ఆదేశాల మేరకు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. వినియోగదారులు తమ సమస్యలపై ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News December 28, 2025
చిత్తూరు: 12 మంది వీఏఓలకు ప్రమోషన్

చిత్తూరు ఉమ్మడి జిల్లాలో 16 మంది వీఏఓ (గ్రామ వ్యవసాయ సహాయ కులు)లకు ఏఈఓలు(వ్యవసాయ విస్తరణ అధికారులు)గా ప్రమోషన్ కల్పించారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ లభించిన అధికారులు 15 రోజుల్లో కేటాయించిన స్థానంలో విధుల్లో చేరాలని ఆయన ఆదేశాలిచ్చారు.
News December 28, 2025
చిత్తూరు జిల్లాకు మరో 25,592 ఇళ్లు.!

PMAY పథకం కింద <<18682670>>చిత్తూరు<<>> జిల్లాకు 25,592 పక్కా గృహాలు అవసరమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇందులో అత్యధికంగా పలమనేరుకు 9,651, కుప్పంకు 6,986, పుంగనూరుకు 2726, GD నెల్లూరుకు 2319, పూతలపట్టుకు 1905, నగరికి 1332, చిత్తూరుకు 671 పక్కా గృహాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఈ అవసరాలకు అనుగుణంగా దశలవారీగా పక్కా గృహాలు మంజూరు చేయనున్నారు.


