News July 4, 2024
మోదీని కలిసిన భారత క్రికెటర్లు

టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు ప్రధాని మోదీని కలిశారు. ఈరోజు ఉదయం 6గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిని ప్రధాని మోదీ అభినందించారు.
Similar News
News March 12, 2026
‘స్వర్ణ’ ఆఫీసుల్లో తరచూ తనిఖీలు

AP: స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డుల పనితీరు మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కలెక్టర్ నుంచి డిప్యూటీ కమిషనర్ల వరకు 8 కేటగిరీల అధికారులు నెలలో 3-12 సార్లు ఆ కార్యాలయాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. అందుతున్న సేవలు, పెన్షన్ల పంపిణీ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను పరిశీలించాలని సూచించింది. సిబ్బంది పనితీరు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టిసారించాలంది.
News March 12, 2026
ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

TG: ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 10వ తేదీలోపే విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 4 లేదా 5వ తేదీన రిజల్ట్స్ ప్రకటించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వాల్యుయేషన్ ఆలస్యమైతే మరో 2-3 రోజులు పట్టే అవకాశమున్నట్లు సమాచారం. రాష్ట్రంలో FEB 25న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 18తో ముగియనున్నాయి. కాగా ఈనెల 4 నుంచే వాల్యుయేషన్ ప్రక్రియ మొదలైంది.
News March 12, 2026
ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులెలా: హైకోర్టు

AP: దేశాలు, రాష్ట్రాలతో పోటీ పడి పెట్టుబడులు రాబట్టాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. మార్కెట్ ధరకే భూములు ఇస్తామంటే కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎకరం రూ.99 పైసలకే ఇస్తున్నారంటూ YCP MP గురుమూర్తి వేసిన పిల్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది.


