News July 4, 2024

టారిఫ్ పెంపుపై కేంద్రం జోక్యం చేసుకోదా?

image

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్స్ టారిఫ్‌లు పెంచి యూజర్లకు షాక్ ఇచ్చాయి. అయితే ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని అధికార వర్గాల సమాచారం. టెలికాం రంగంలో సంస్థల మధ్య తగిన పోటీ ఉందని, కేంద్రం జోక్యం చేసుకునేంత పరిస్థితులు లేవని పేర్కొన్నాయి. బయటదేశాలతో పోలిస్తే భారత్‌లో టారిఫ్ ధరలు ఇంకా తక్కువగానే ఉన్నట్లు తెలిపాయి. అయితే టెలికాం సంస్థలు సేవల్లో నాణ్యత పెంచుకోవాల్సి అవసరం ఉందని సూచించాయి.

Similar News

News March 4, 2026

ADB: పెళ్లిళ్లలో కట్న కానుకల నిషేధం.. ఏకమైన గ్రామస్థులు

image

గ్రామస్థుల ఐక్యత ఒకరికి ఆసరా అయ్యింది. ఇంద్రవెల్లి మండలం దోడంద గ్రామంలో పెళ్లిళ్లలో కట్న కానుకలు నిషేధించడంతో గ్రామస్థులంతా తోచినంత పొదుపు చేసుకుని ఇటీవల నిశ్చితార్థమైంది. కొడప రేణుక కుటుంబానికి గ్రామస్థులంతా కలిసి రూ. 21,000 వేల ఆర్థిక సహాయంగా అందజేసినట్లు గ్రామ పటేల్ తుంరం మల్కు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

News March 4, 2026

RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>RITES<<>> లిమిటెడ్‌ 5 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సర్వేయర్, CA/ICWA/CFA/MBA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. మార్చి 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://rites.com/

News March 4, 2026

చర్చల ప్రసక్తే లేదు.. సుదీర్ఘ యుద్ధమే: ఇరాన్

image

చర్చలపై US అధ్యక్షుడు ట్రంప్ చేసిన <<19290770>>వ్యాఖ్యలపై<<>> ఇరాన్ స్పందించింది. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని సుప్రీం నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ అలీ లరిజానీ స్పష్టం చేశారు. సుదీర్ఘ యుద్ధానికి తమను తాము సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 2 దేశాల మధ్య డిస్కషన్స్ జరుగుతుండగానే ద్వేషంతో ట్రంప్ దాడులు చేశారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మండిపడ్డారు. అణు చర్చలను రియల్ ఎస్టేట్ లావాదేవీల్లా మార్చారని ఫైరయ్యారు.