News July 4, 2024
స్పేస్లోకి కాదు.. మోదీ ముందు మణిపుర్ వెళ్లాలి: జైరాం రమేశ్

PM మోదీని స్పేస్లోకి పంపించడం గొప్పగా భావిస్తామన్న ఇస్రో చీఫ్ సోమ్నాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సెటైర్లు వేశారు. ‘స్పేస్లోకి వెళ్లేముందు బయోలాజికల్ పీఎం మణిపుర్ వెళ్లాలి’ అని ట్వీట్ చేశారు. గతేడాది మణిపుర్లో తెగల మధ్య హింస వల్ల సుమారు 225 మంది మరణించారు. మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఈ ఘటనలు తీవ్ర చర్చనీయాంశం కాగా నిన్న రాజ్యసభలో మోదీ తొలిసారి మణిపుర్ అంశంపై మాట్లాడారు.
Similar News
News March 4, 2026
నల్గొండ: కళాకారులకు వరం.. పీఎం విశ్వకర్మ మేళా!

చేతివృత్తుల కళాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 6 నుంచి 8 వరకు ఎస్బీఆర్ (SBR) ఫంక్షన్ హాల్లో ‘పీఎం విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్’ నిర్వహిస్తోంది. ఎంఎస్ఎంఈ (MSME) ఆధ్వర్యంలో జరిగే ఈ మూడు రోజుల ప్రదర్శనలో లబ్ధిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి, విక్రయించుకోవచ్చు. ఈ అవకాశాన్ని కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
News March 4, 2026
RITES లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News March 4, 2026
చర్చల ప్రసక్తే లేదు.. సుదీర్ఘ యుద్ధమే: ఇరాన్

చర్చలపై US అధ్యక్షుడు ట్రంప్ చేసిన <<19290770>>వ్యాఖ్యలపై<<>> ఇరాన్ స్పందించింది. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని సుప్రీం నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ అలీ లరిజానీ స్పష్టం చేశారు. సుదీర్ఘ యుద్ధానికి తమను తాము సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 2 దేశాల మధ్య డిస్కషన్స్ జరుగుతుండగానే ద్వేషంతో ట్రంప్ దాడులు చేశారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మండిపడ్డారు. అణు చర్చలను రియల్ ఎస్టేట్ లావాదేవీల్లా మార్చారని ఫైరయ్యారు.


