News July 4, 2024
తొలిసారి 80వేల మార్క్తో ముగిసిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ను స్వల్ప లాభాలతో ముగించాయి. ఆరంభంలో ఉన్న జోరు చివరి దాకా కొనసాగకున్నా సెన్సెక్స్ ట్రేడింగ్ తొలిసారి 80వేల మార్క్లో ముగిసింది. 62 పాయింట్లు లాభపడిన సూచీ 80,049 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 24,302 వద్ద స్థిరపడింది. టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, టీసీఎస్ షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
Similar News
News March 3, 2026
యుద్ధ ప్రభావం.. ఇరాన్లో 787 మంది మృతి

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడుల వల్ల ఇప్పటి వరకు 787 మంది మరణించినట్లు ఇరాన్ రెడ్ క్రెసెంట్ వెల్లడించింది. రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్లోని కీలక సైనిక కేంద్రాలు, వ్యూహాత్మక స్థావరాలపై దాడులు కొనసాగుతుండటంతో ప్రాణనష్టం పెరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు 1,000 మంది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మరణించారు.
News March 3, 2026
270పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(NCL)లో 270 అసిస్టెంట్ ఫోర్మెన్ (ట్రైనీ) పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. నెలకు రూ.47,330తో పాటు అలవెన్సులు చెల్లిస్తారు. రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.nclcil.in
News March 3, 2026
అడల్ట్ కంటెంట్ను INDలో బ్లాక్ చేసిన X

దేశంలో అశ్లీల కంటెంట్ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా X కీలక నిర్ణయం తీసుకుంది. పరస్పర అంగీకారంతో ఇండియాలో అడల్ట్/పోర్న్ వీడియోలను నేటి నుంచి బ్లాక్ చేయనుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఈ కంటెంట్ యథావిధిగా అందుబాటులో ఉండనుంది. స్థానిక చట్టాలకు లోబడి ప్లాట్ఫామ్ను సురక్షితంగా ఉంచడమే దీని ఉద్దేశం. భారత్లో ఇకపై ఎటువంటి సెన్సిటివ్ & అడల్ట్ కంటెంట్ Xలో కనిపించదు.


