News July 4, 2024

జగన్ ఘర్షణ వాతావరణం సృష్టించాలని చూశారు: హోంమంత్రి అనిత

image

AP: జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు మాజీ సీఎం జగన్ రూ.25లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. ములాఖత్‌లు అయిపోయినా మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతి ఇచ్చామని తెలిపారు. కానీ ఆయన ఘర్షణ వాతావరణం సృష్టించాలని ప్రయత్నించారని, జైలు నుంచి బయటకు వచ్చి మీడియాతో ఏదేదో మాట్లాడి వెళ్లిపోయారని అన్నారు. గత ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ చేపడతామని పేర్కొన్నారు.

Similar News

News March 20, 2026

కేరళంపై కమలం గురి – 1/2

image

కేరళంలో పాగా వేయాలని ఈసారి ప్రధాన కూటములు LDF, UDFతో పాటు BJP కూడా శ్రమిస్తోంది. పెరుగుతున్న ఓట్ షేర్‌ను సీట్లుగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10.57%గా ఉన్న BJP షేర్ 2021లో 11.30%కు పెరిగింది. అప్పుడు NDAకి 2.55% తగ్గి 12.41% వచ్చినా వ్యక్తిగతంగా BJPకి ప్లసే అయింది. 2024 LS పోల్స్‌లో NDAకి 19.24% వచ్చింది. ఇందులో ఒక్క బీజేపీకే 16.68% (3.68%+) వచ్చింది. <<-se>>#Elections2026<<>>

News March 20, 2026

కేరళంపై కమలం గురి – 2/2

image

ఇక తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో విక్టరీతో బీజేపీకి బూస్ట్ దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాసర్‌గోడ్, పాలక్కడ్, నెమోమ్ సహా 9 స్థానాల్లో BJP రన్నరప్‌గా నిలిచింది. ఈసారి పార్టీ వీటిపై దృష్టి పెడితే కేరళంలో పాగా ఈజీ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్‌ను తిప్పుకోవాలన్న ప్రయత్నాలు సక్సస్ అయితే కేరళంలో ఈసారి బీజేపీ ఇంపాక్ట్ కనిపిస్తుందని అంటున్నారు. <<-se>>#Elections2026<<>>

News March 19, 2026

IPL-2026: స్టార్ బౌలర్లు దూరం!

image

IPL-2026కు మరో ఇద్దరు విదేశీ బౌలర్లు దూరం కానున్నారు. రాజస్థాన్ తరఫున ఆడనున్న సామ్ కరన్ (ఇంగ్లండ్) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం అయ్యారని క్రీడావర్గాలు వెల్లడించాయి. అటు పంజాబ్ కింగ్స్ బౌలర్ ఫెర్గూసన్ (న్యూజిలాండ్) ఇటీవల తండ్రి అయ్యారు. బిడ్డతో గడిపేందుకు స్వదేశానికి వెళ్లనుండటంతో ఆరంభంలోని కొన్ని మ్యాచులకు దూరం కానున్నారు. ఇప్పటికే కమిన్స్, హేజిల్‌వుడ్ కొన్ని మ్యాచులు ఆడట్లేదు.