News July 4, 2024
నెల్లూరులో వ్యక్తి దారుణ హత్య

నెల్లూరు రూరల్ రామకోటయ్య నగర్లో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు నీతురాజ్ (23) అనే వ్యక్తిని గొంతు కోసి నడి రోడ్డుపైనే వదిలేసి పారిపోయారు. దీంతో నీతూరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి రామకోటయ్య నగర్ సుజాత రావు కాంప్లెక్స్ కు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 3, 2026
నెల్లూరు: ప్రేమికుల మృతి.. ఎలా గుర్తించారంటే?

రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులోని అడవిలో ప్రేమికులు <<19290866>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. మృతులు ముత్తుకూరు మండలం పంటపాలేనికి ఆలపాక ప్రసన్న కుమార్(24), చిట్టమూరు మండలం చింతలతోపునకు చెందిన ఎం.సావిత్రి(26)గా గుర్తించారు. తేనె సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన పంగిలి గ్రామస్థులు మృతదేహాలను చూశారు. సమీపంలోని బైకుపై దొరికిన హ్యాండ్ బ్యాగులో ఉన్న ఫోన్ల ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
News March 3, 2026
నెల్లూరు: 15 పోస్టుల్లో 6 ఖాళీ..!

నెల్లూరు జిల్లాలో 110KM విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉంది. 53,541మంది మత్స్యకారులు ఉండగా.. 39,590 ఎకరాల ఆక్వా సాగులో ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మత్స్యశాఖలో 15 పోస్టులే ఉన్నాయి. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ 8మందికి 4 ఖాళీలు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ అఫ్ ఫిషరీస్ 4 పోస్టులకు 2ఖాళీలు ఉన్నాయి. దీంతో సాగరమిత్రలపై పనిభారం పెరుగుతోందని సమాచారం. వీరికి గత 4నెలలుగా జీతాలు కూడా సరిగా రావడం లేదని తెలుస్తోంది.
News March 3, 2026
నెల్లూరు జిల్లాలో ప్రేమజంట సూసైడ్

నెల్లూరు జిల్లాలో ప్రేమ జంట మృతి కలకలం రేపింది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న(25)కు సోషల్ మీడియా ద్వారా చిట్టమూరుకు చెందిన యాకసిరి సావిత్రి(24) పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఏమైందో ఏమో రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద ఉరేసుకున్నారు. పురుగుల మందు తాగిన తర్వాత ఉరేసుకుని ఉంటారని సమాచారం. సావిత్రికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.


