News July 4, 2024
కల్లూరు: గుండెపోటుతో RTC బస్సు డ్రైవర్ మృతి

పులిచెర్ల మండలం కొక్కువారిపల్లె సమీపంలో RTC డ్రైవర్ రాఘవయ్య గుండెపోటుతో మృతి చెందాడు. పుంగనూరు RTC డిపోకు చెందిన బస్సు తిరుపతి నుంచి కల్లూరుకి వస్తుండగా మార్గమధ్యంలో ఆర్టీసీ డ్రైవర్ రాఘవయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో కండక్టర్ హుటాహుటిన డ్రైవర్ను సమీపంలోని పులిచెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
Similar News
News September 20, 2025
కుప్పం: భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్ట్

కుప్పం (M) బైరప్ప కొట్టాలుకు చెందిన కీర్తిపై కత్తితో దాడి చేసిన భర్త రాజేశ్ను అరెస్టు చేసినట్లు DSP పార్థసారథి, సీఐ శంకరయ్య తెలిపారు. రెండేళ్ల క్రితం తల్లి అనుమతి లేకుండా మైనర్ బాలికను ప్రేమ వివాహం చేసుకున్న రాజేశ్ డెలివరీ కోసం భార్యను పుట్టింటికి పంపించాడు. డెలివరీ అయి 4 నెలలు కావస్తుండగా కాపురానికి రావాలంటూ ఒత్తిడి చేయగా ఆమె రాకపోవడంతో ఈ నెల 17న కత్తితో దాడి చేశాడు.
News September 20, 2025
చిత్తూరు: గూడ్స్ రైలు కింది పడిన స్నేహితులు

నెల్లూరులోని వెంకటేశ్వరపురం మూడో రైల్వే లైనుపై ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఒకరు మృతి చెందారు. రైల్వే SI హరిచందన వివరాలు.. చిత్తూరు(D) పూతలపట్టుకు చెందిన ఉమేష్ చంద్ర(25), పొదలకూరుకు చెందిన వంశీ స్నేహితులు. వీరు గూడ్స్ రైలు ఎదురుగా నిలబడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉమేష్ చంద్ర మృతిచెందగా, వంశీ పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్లో చేర్పించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 19, 2025
కుప్పం : భార్యపై హత్యాయత్నం చేసిన భర్త అరెస్ట్

కుప్పం (M) బైరప్ప కొట్టాలుకు చెందిన కీర్తిపై కత్తితో దాడి చేసిన భర్త రాజేశ్ను అరెస్టు చేసినట్లు DSP పార్థసారథి, సీఐ శంకరయ్య తెలిపారు. రెండేళ్ల క్రితం తల్లి అనుమతి లేకుండా మైనర్ బాలికను ప్రేమ వివాహం చేసుకున్న రాజేశ్ డెలివరీ కోసం భార్యను పుట్టింటికి పంపించాడు. డెలివరీ అయి 4 నెలలు కావస్తుండగా కాపురానికి రావాలంటూ ఒత్తిడి చేయగా ఆమె రాకపోవడంతో ఈ నెల 17న కత్తితో దాడి చేశాడు.