News July 5, 2024

విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ చొరవ తీసుకోవాలి: CM

image

TG: విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోం శాఖ చొరవ తీసుకోవాలని CM రేవంత్ అన్నారు. APలో విలీనమైన 5 గ్రామాలను TGలో కలపాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కోరినట్లు చెప్పారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, జిల్లాకో నవోదయ స్కూల్, రాష్ట్ర రహదారులు నేషనల్ హైవేలుగా మార్చాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కోరినట్లు తెలిపారు.

Similar News

News March 25, 2026

ఆ ఫుడ్స్ తింటే తండ్రయ్యే ఛాన్స్ తక్కువట!

image

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తింటే పురుషుల్లో సంతానలేమి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్ వర్సిటీ స్టడీలో తేలింది. చిప్స్, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ లాంటివి అధికంగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ తగ్గి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ టైమ్ పడుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు. అటు మహిళల్లో ఈ ఫుడ్ వల్ల గర్భంలో పిండం ఎదుగుదల నెమ్మదిస్తుందని ఈ సర్వే హెచ్చరించింది.

News March 25, 2026

చిన్న నియోజకవర్గం.. గొప్ప అభివృద్ధి

image

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి. దీనివల్ల ఒక్కో MP పరిధిలోని జనాభా 30 లక్షల నుంచి 15 లక్షలకు తగ్గుతుంది. చిన్న నియోజకవర్గాల వల్ల MPలు ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తారు. ఫలితంగా స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు MP నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది. ఈ మార్పు క్షేత్రస్థాయి అభివృద్ధికి, యువ నాయకత్వం రాజకీయాల్లోకి రావడానికి అవకాశంగా నిలుస్తుంది.

News March 25, 2026

అమెరికా-ఇరాన్ మధ్య పాక్.. వ్యూహమా? స్వార్థమా?

image

US, ఇరాన్ మధ్య గొడవను ఆపేందుకు పాక్ ఇప్పుడు మధ్యవర్తిగా మారుతోంది. దీని వెనుక శాంతి కంటే స్వార్థమే ఎక్కువ కనిపిస్తోందని అనలిస్టులు అంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాలేక గల్ఫ్ దేశాల సపోర్ట్ కోసం ఇలా చేస్తోందని విశ్లేషిస్తున్నారు. అలాగే ఇండియా ఇన్‌ఫ్లుయెన్స్‌ను తగ్గించాలనే వ్యూహమూ కనిపిస్తోందంటున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ డైరెక్షన్‌లో జరుగుతున్న ఈ టాక్టిక్స్‌కు ఇరాన్ ఇంకా ఓకే చెప్పలేదు.