News July 5, 2024
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం

AP: కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గంజాయి, సిగరెట్లను క్యాంపస్లోకి తీసుకెళ్తూ సెక్యూరిటీకి పట్టుబడ్డారు. దీంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News March 4, 2026
టీచర్ల జీతాలను ప్రభుత్వం తగ్గించదు: KK

TG: ప్రభుత్వ టీచర్ల జీతాలు తగ్గించాలంటూ విద్యాకమిషన్ సర్కారుకు నివేదిక ఇచ్చిందన్న వార్తలపై ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ కే.కేశవరావు స్పందించారు. ప్రభుత్వం టీచర్ల జీతాలను తగ్గించదని స్పష్టం చేశారు. శాలరీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఉపాధ్యాయ సంఘాలను పిలిచి మాట్లాడుతామని చెప్పారు. అన్ని జీవోలు పబ్లిక్ డొమైన్లో పెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం నెల రోజుల్లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తెస్తుందని వివరించారు.
News March 4, 2026
రోజూ అత్యాచార బెదిరింపులు: ఆయేషా ఖాన్

తాను రోజూ ఆన్లైన్లో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లు ‘ధురంధర్’ స్పెషల్ సాంగ్ నటి ఆయేషా ఖాన్ వెల్లడించారు. తాను ఏం ధరించినా అసభ్య కామెంట్లు చేస్తారని, అత్యాచారం చేస్తామని బెదిరిస్తుంటారని వాపోయారు. సమాజంలో ఇదొక ప్రమాదకర వైఖరని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈమె తెలుగులో ముఖచిత్రం, ఓం భీమ్ బుష్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే, జాట్ చిత్రాల్లో నటించారు.
News March 4, 2026
ఇరాన్ మరో 10 రోజులు యుద్ధం చేస్తే USకు దెబ్బే!

యుద్ధంలో ఖమేనీని తొలిరోజే అంతం చేసిన అమెరికాకు ఇరాన్ కొరకరాని కొయ్యగా మారింది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ లొంగిపోకుండా దాడులు తీవ్రతరం చేస్తోంది. ఈ యుద్ధం 4 వారాల్లో పూర్తవుతుందని ట్రంప్ చెబుతున్నా అది మరింత కాలం సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో 10 రోజులు దాడులు కొనసాగితే అమెరికా Tomahawk మిస్సైళ్లతో పాటు SM-3 interceptors లాంటి కీలక ఆయుధాల స్టాక్స్ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు CNN పేర్కొంది.


