News July 5, 2024
కడప: ఉద్యోగం రాలేదని యువకుడు సూసైడ్

కడప ఎర్రముక్కపల్లిలోని ఓ లాడ్జిలో ఉరి వేసుకొని చీర రంజిత్(25) సూసైడ్ చేసుకున్నట్లు 1టౌన్ సీఐ భాస్కర్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన రంజిత్ 2 రోజుల కిందట కడపలోని స్నేహితుడు ప్రశాంత్ రెడ్డి అక్క పెళ్లికి వచ్చాడు. లాడ్జిలో స్నేహితులతో కలిసి బసచేశాడు. పలుపోటీ పరీక్షలు రాసినా ఉద్యోగం రాలేదు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాని పోలీసులు తెలిపారు.
Similar News
News March 18, 2026
కడప జిల్లాలో ఓపెన్ 10th పరీక్షలు.. 387 మంది డుమ్మా..!

జిల్లాలో బుధవారం 31 కేంద్రాల్లో ఓపెన్ టెన్త్ పరీక్షలు నిర్వహించారు. నేడు జరిగిన హిందీ పరీక్షకు మొత్తం 2,356 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం 1,969 మంది మాత్రమే పరీక్ష రాశారు. 387 మంది విద్యార్థులు పరీక్షకు డుమ్మా కొట్టినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కడప మున్సిపల్ ఉర్దూ బాలుర పాఠశాల కేంద్రంలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
News March 18, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,530
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ. 14,288
*వెండి 10 గ్రాముల ధర రూ.2,575
News March 18, 2026
కడప జిల్లాలో రైతుల నుంచి వసూళ్లు ఎంత..?

కడప జిల్లాలో రైతుల నుంచి MSPతో పంటల కొనుగోలు కోసం మార్క్ ఫెడ్ 21 ప్రొక్యూర్ మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 5,732 మంది శనగ రైతులు వీటిలో రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 3,143 మంది రైతుల నుంచి 13,078.5 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేశారు. బస్తాకు రూ.150 – రూ.200లు మామూళ్లు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన రూ.3, 4 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


