News July 5, 2024

APలో రూ.60వేల కోట్లతో BPCL రిఫైనరీ

image

AP: మచిలీపట్నంలో రూ.60వేల కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు చేయాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నిన్న పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురితో సీఎం చంద్రబాబు ఈ విషయంపై చర్చించారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 2-3 వేల ఎకరాల భూమి అవసరమని కేంద్రమంత్రి సూచించగా.. మచిలీపట్నంలో అందుబాటులో ఉందని సీఎం, ఎంపీ బాలశౌరి వివరించారు.

Similar News

News October 6, 2024

ఇంటిపనులు చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే!

image

దొంగలు పలు రకాలు! ఇంట్లోవాళ్లను చంపిమరీ దోచుకెళ్లే వారు కొందరు. బట్టలు ఉతికి, మొక్కలకు నీళ్లుపోసి, ఫ్లోర్ తుడిచి, ఇల్లు సర్ది, వంటచేసి, భోజనం తిని ‘ఫీల్ ఎట్ హోమ్’ అన్నట్టుగా ప్రవర్తించేవారు ఇంకొందరు. UKలో వోజ్నిలోవిక్ ఇదే కోవకు చెందుతాడు. ఓ మహిళ ఇంట్లోకి చొరబడి వైన్ తాగి ‘డోన్ట్ వర్రీ, బీ హ్యాపీ, బాగా తినండి’ అని రాసిపెట్టాడు. మరో ఇంటికెళ్లి పట్టుబడ్డాడు. కోర్టు అతడికి 22 నెలల జైలుశిక్ష వేసింది.

News October 6, 2024

ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు: భట్టి

image

TG: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉచితంగా నాణ్యమైన విద్య కోసం ప్రతి నియోజకవర్గంలో ఈ స్కూళ్లను కట్టాలని నిర్ణయించామన్నారు. దసరా కంటే ముందే వీటికి భూమిపూజ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 1023 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉంటే 600కు పైగా పాఠశాలలకు సొంత భవనాలు లేవని భట్టి తెలిపారు.

News October 6, 2024

విమానాలు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి?

image

విమానాలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయి. దీనికో కారణం ఉంది. ‘వైట్ పెయింట్ సూర్యరశ్మిని గ్రహించదు. గాల్లో ఉన్నప్పుడు, నేలపై పార్క్ చేసి ఉంచినప్పుడు తెలుపు రంగు క్యాబిన్‌లో వేడిని తగ్గిస్తుంది’ అని నిపుణులు చెబుతున్నారు. డార్క్ పెయింట్‌తో పోల్చితే వైట్ తేలికైనది. డార్క్ కలర్ వేయడం వల్ల విమానం 8 మంది ప్రయాణికులంత బరువు ఎక్కువవుతుంది. తెలుపు రంగు వల్ల గాల్లో పక్షులు ఢీ కొట్టడం తగ్గుతుంది.