News July 5, 2024

విశాఖ: డీసీఐకి రూ.156.5 కోట్లతో ఒప్పందం

image

ప్రతిష్ఠాత్మకమైన కొచ్చిన్ పోర్టు అథారిటీ‌తో రూ. 156.50 కోట్ల విలువైన డ్రెడ్జింగ్ ఒప్పందం కుదిరినట్లు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఛైర్మెన్ అంగముత్తు తెలిపారు. డ్రెడ్జింగ్ పరిశ్రమల్లో డీసీఐ అగ్రగామిగా ఉందన్నారు. భారీస్థాయి డ్రెడ్జింగ్ ప్రాజెక్టులను అమలు చేయడంలో మంచి రికార్డు ఉందని వెల్లడించారు. ఈ ఒప్పందం డీసీఐ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News October 6, 2024

విశాఖ: ఉక్కు పోరాట కమిటీతో నేడు పవన్ కళ్యాణ్ భేటీ

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఆదివారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో భేటీ కానున్నారు. స్టీల్ ప్లాంట్ యువ కార్మికులు శనివారం మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుట ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. అక్కడ జనసేన నాయకులను కలిసి స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఈ నేపథ్యంలో తమను కలిసేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించినట్లు కమిటీ నాయకులు తెలిపారు.

News October 6, 2024

చింతపల్లి: కులం పేరుతో దూషించాడని స్నేహితుడినే చంపారు

image

కులం పేరుతో దూషించాడని లోతుగెడ్డ జంక్షన్ వద్ద అర్జున్ (50) అనే వ్యక్తిని ఇద్దరు స్నేహితులు కొట్టి చంపారు. గత నెల 27న పుష్పరాజ్, వెంకటేశ్, అర్జున్ అనే ముగ్గురు స్నేహితులు మద్యం తాగేందుకు లోతుగెడ్డ వెళ్లారు. అక్కడ మద్యం తాగుతున్న సమయంలో పుష్పరాజ్‌ను అర్జున్ కులం పేరుతో దూషించాడు. దీంతో అతడిని రాయితో కొట్టి హతమార్చారు. ఈమేరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సీఐ రమేశ్, ఎస్సై అరుణ్ కిరణ్ తెలిపారు.

News October 5, 2024

బుచ్చియ్యపేట: కరెంట్ షాక్.. బాలుడు మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతిచెందిన ఘటన బుచ్చియ్యపేట మండలంలోని పి.భీమవరంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన వేపాడ అప్పారావు కుమారుడు భువన్ శంకర్ శనివారం పొలంలోకి వెళ్లాడు. అక్కడ గెడ్డ దాటుతుండగా అప్పటికే నేలపై తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం చోడవరం ఆసుపత్రికి  తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.