News July 5, 2024
విశాఖ: డీసీఐకి రూ.156.5 కోట్లతో ఒప్పందం

ప్రతిష్ఠాత్మకమైన కొచ్చిన్ పోర్టు అథారిటీతో రూ. 156.50 కోట్ల విలువైన డ్రెడ్జింగ్ ఒప్పందం కుదిరినట్లు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఛైర్మెన్ అంగముత్తు తెలిపారు. డ్రెడ్జింగ్ పరిశ్రమల్లో డీసీఐ అగ్రగామిగా ఉందన్నారు. భారీస్థాయి డ్రెడ్జింగ్ ప్రాజెక్టులను అమలు చేయడంలో మంచి రికార్డు ఉందని వెల్లడించారు. ఈ ఒప్పందం డీసీఐ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News March 8, 2026
విశాఖలో చేయి తడిపితేనే.. కొళాయి కనెక్షన్

విశాఖలోని నీటి కొళాయి కనెక్షన్ కోసం జీవీఎంసీకి దరఖాస్తు చేసి, ఫీజులు చెల్లించినా మంజూరులో జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రూప్ హౌస్లు, అపార్ట్మెంట్ల బల్క్ వాటర్ కనెక్షన్ల విషయంలో కింది స్థాయి సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకుంటే ఫైళ్లు పెండింగ్లో ఉంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మీ పరిధిలో ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ చేయండి.
News March 7, 2026
విశాఖ: పన్నులు చెల్లించకుంటే జప్తే

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా జీవీఎంసీ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. రూ.650 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు మొండి బకాయిదారులపై చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 1,36,149 మంది బకాయిదారులను గుర్తించి, 1,10,136 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నీటి పన్ను చెల్లించని 62,290 మందికి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రూ.458.9 కోట్లు వసూలు కాగా, రూ.188.20 కోట్లు రావాల్సి ఉంది.
News March 7, 2026
విశాఖ: పన్నులు చెల్లించకుంటే జప్తే

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా జీవీఎంసీ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. రూ.650 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు మొండి బకాయిదారులపై చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 1,36,149 మంది బకాయిదారులను గుర్తించి, 1,10,136 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నీటి పన్ను చెల్లించని 62,290 మందికి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రూ.458.9 కోట్లు వసూలు కాగా, రూ.188.20 కోట్లు రావాల్సి ఉంది.


