News July 5, 2024

VZM: పోస్టింగులకు కార్యదర్శుల ఎదురు చూపులు..!

image

సరిగ్గా మూడు నెలల క్రితం జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 ఉద్యోగులుగా పదోన్నతి లభించింది. ఇప్పటికీ కూడా వారికి పోస్టింగులు ఇవ్వకపోవడంతో ఎదురు చూస్తున్నారు. మార్చి 16 నుంచి జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలు అడ్డొచ్చాయి. కోడ్ ముగిసి నెల దాటుతున్నా పోస్టింగులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.

Similar News

News October 6, 2024

VZM: మంత్రి కొండపల్లికి ఘన స్వాగతం

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుబడులను ఆహ్వానించేందుకు 10 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని విజయనగరం జిల్లా విచ్చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ఘన స్వాగతం లభించింది. విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద గంట్యాడ మండల టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరరావు, పార్టీ నాయకులు మంత్రికి స్వాగతం పలికి సత్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

News October 6, 2024

VZM: నేడు జిల్లాకు మంత్రి కొండపల్లి రాక

image

రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎన్.ఆర్.ఐ.వ్యవహారాలు, సెర్ప్ శాఖల మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం జిల్లాకు వస్తున్నారు. మంత్రి ఉదయం 4.45 గంటలకు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో నగరానికి చేరుకొంటారు. అనంతరం స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి తెలిపారు. గజపతినగరం నియోజకవర్గంలో పర్యటిస్తారని వెల్లడించారు.

News October 6, 2024

విజయనగరం: TODAY TOP HEAD LINES

image

✮పార్వతీపురం: అర్ధరాత్రి ఏనుగుల గుంపు హల్‌చల్
✮విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు: కేంద్రమంత్రి
✮విజయనగరంలో ఈ నెల 8న జాబ్ మేళా
✮విజయనగరం: మాన్సాస్ ఆక్రమణల తొలగింపు
✮కురుపాం: ఆత్మహత్యాయత్నానికి కారణం భర్త అక్రమ సంబంధమే!
✮పెదపథంలో ఆరోగ్య ఉపకేంద్రం శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి
✮విశాఖ బీచ్‌లో నల్లటి ఇసుక వెనుక కారణం ఇదే..!
✮VZM: ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్షలు