News July 5, 2024

నర్సింహులపేట: ఇద్దరు యువకుల మృతి.. కేసు నమోదు

image

MHBD జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో అనుమానాస్పద స్థితిలో శ్రవణ్ (25), రహీమ్ (24) అనే ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం విదితమే. ఈ విషయమై స్థానిక పోలీసులకు బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి మృతికి కల్తీ కల్లు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

Similar News

News October 6, 2024

మహాలక్ష్మి అలంకరణలో భద్రకాళి అమ్మవారు

image

ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో నాలుగో రోజు ఆదివారం భద్రకాళి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో ఆలయ అర్చకులు అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.

News October 6, 2024

ఉగాండాలో జనగామ జిల్లా వాసి దారుణ హత్య

image

జనగామ జిల్లా వాసిని ఉగాండాలో హత్య చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. పట్టణానికి చెందిన తిరుమలేశ్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌గా ఉగాండాలోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్నారు. అక్కడే పని చేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు తాగిన మైకంలో తిరుమలేశ్‌పై కాల్పులు జరపడంతో ప్రాణాలు వదిలాడు. అనంతరం సెక్యూరిటీ గార్డు తనను తాను కాల్చుకొని మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News October 6, 2024

జనగామ: అదృష్టం అంటే ఈవిడదే.. పోయిన బంగారం మళ్లీ దొరికింది

image

పోగొట్టుకున్న బంగారాన్ని ఓ వృద్ధురాలు మళ్లీ పొందగలిగింది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన సోమలక్ష్మి అనే వృద్ధురాలు.. ప్రభుత్వం ఇచ్చిన రాయితీ బియ్యం సంచిలో 5 తులాల బంగారం దాచింది. అయితే గ్రామంలో ఓ వ్యక్తికి ఆబియ్యంను విక్రయించింది. బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తి మరుసటి రోజు మళ్లీ రాగా అతనికి విషయం చెప్పింది. బియ్యం సంచుల్లో వెతకడంతో బంగారం దొరికింది.