News July 5, 2024

NLR: ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు

image

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు.. అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు డీఈఓ రామారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. nationalawards toteachers. education. gov. in వెబ్‌సైట్‌లో ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హతలు, ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలని డీఈవో సూచించారు.

Similar News

News March 11, 2026

మత్స్య పరిశోధన కేంద్రాల స్థాపన కోసం నిధులు ఏర్పాటుపై ఎంపీ ఆరా

image

ఏపీలో అదనపు మత్స్య పరిశోధన కేంద్రాలను స్థాపించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, గత మూడేళ్లలో కేటాయించిన నిధులపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆరా తీశారు. లోక్‌సభలో మంగళవారం ఈ అంశంపై వివరాలు కోరారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో నాలుగు ప్రాంతీయ మత్స్య పరిశోధన కేంద్రాలు ఉన్నాయన్నారు.

News March 10, 2026

కావలి: మామిడి తోటలో ఉరి వేసుకొని వ్యక్తి మృతి

image

కావలి రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన నూకల పాటి శివప్రసాద్ రెడ్డి (65) మంగళవారం మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడని రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి కాంతమ్మ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుమల్ రెడ్డి తెలిపారు. అనారోగ్య కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

News March 10, 2026

నెల్లూరు: మహిళ దారుణ హత్య

image

నెల్లూరు వనంతోపు సెంటర్‌కు చెందిన వెంకయ్య, తన భార్య హజరత్తమ్మ (41)ను రాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. వీరు పల్నాడు జిల్లా నరసరావుపేట(M) ఇసప్పాలెం మహంకాళి తిరునాళ్లకు వెళ్లారు. ఆ సమయంలో ఘర్షణ చోటుచేసుకుని హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు నరసరావుపేట పోలీసులు స్పందించి, నిందితుడు వెంకయ్యను అదుపులోకి తీసుకున్నారు. పాత సామాన్లు ఏరుకుంటూ జీవనం సాగించేవారని గుర్తించారు.