News July 5, 2024

విజయవాడ: నేటి నుంచి తిరుమల ఎక్స్ ప్రెస్ రద్దు

image

తిరుమల ఎక్స్ ప్రెస్‌ను జులై 5 నుంచి 11వ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండటంతో తాత్కాలికంగా తిరుమల ఎక్స్ ప్రెస్ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రాజమండ్రి మీదుగా తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని కోరారు.

Similar News

News January 27, 2026

కృష్ణా: విద్యాశాఖ శకటానికి ప్రథమ బహుమతి

image

జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించిన శకటాల ప్రదర్శనలో విద్యా శాఖ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. రెండవ బహుమతిని చేనేత, జౌళి శాఖ, సాంఘిక, పరిశ్రమల శాఖ సంయుక్తంగా ప్రదర్శించిన శకటానికి దక్కగా, మూడవ బహుమతిని DRDA శకటానికి దక్కింది. ఆయా శాఖల జిల్లా అధికారులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు.

News January 26, 2026

విశాఖలో కృష్ణా జిల్లా విద్యార్థి అనుమానాస్పద మృతి

image

అవనిగడ్డ ప్రాంతానికి చెందిన AU MCA ఫస్ట్ ఇయర్ విద్యార్థి లీలా సాయి విశాఖ నగరంలోని రేసవానిపాలెంలోని అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహం కుళ్లి, దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం పోలీసులు తలుపులు తెరిచి పరిశీలించగా ఘటన వెలుగులోకి వచ్చింది. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 25, 2026

అవార్డు అందుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం విజయవాడ తుమ్మలపల్లిలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఓటర్ల జాబితా సవరణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. 2022 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాలో అనుసంధానం చేసే ప్రత్యేక సవరణ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిభ కనబర్చారు.