News July 5, 2024

ఉమామహేశ్వరంలో మంత్రులు, ఎమ్మెల్యేలు

image

అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయాన్ని రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజానర్సింహా, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, పలువురు దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.

Similar News

News October 6, 2024

NGKL: జీతాలు చెల్లించండి రేవంత్ సారూ..!

image

నాగర్ కర్నూల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ జీతాలు చెల్లించాలని సీఎం రేంవత్ రెడ్డిని వేడుకుంటున్నారు. రెండు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. జీతాలు రాక ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే.. ఇక బతుకమ్మ పండుగ ఎలా చేసుకోవాలని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దసరా పండుగ సమీపిస్తుంన్నందున ప్రభుత్వం స్పందించి తమ జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.

News October 6, 2024

గద్వాల: మెడిసిన్ సీటు సాధించిన పేదింటి బిడ్డ

image

గద్వాల ఎర్రమట్టి వీధికి చెందిన పావని జమ్మన్న దంపతుల కూతురు వైష్ణవి మెడిసిన్‌లో సీటు సాధించింది. విషయం తెలుసుకున్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ఆదివారం వారి ఇంటికి వెళ్లి సన్మానించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పేదింటి బిడ్డలు చదువులో రాణించి అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కన్వీనర్ బుచ్చిబాబు పాల్గొన్నారు.

News October 6, 2024

NGKL: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పర్యాటక టూర్లు

image

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పురాతన గుడులు
పర్యటక ప్రదేశాలను చూపించనున్నారు. తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా 2,4 తరగతుల ఒక్కో విద్యార్థికి రూ.300/- 5, 8 తరగతుల వారికి రూ.800/-, 9,ఇంటర్, వారికి రూ.2000/-డిగ్రీ విద్యార్థులకు రూ.4000/-చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించడం జరుగుతుంది. 3వేల విద్యార్థులకు అవకాశం దక్కనుందని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు వెల్లడించారు.