News July 5, 2024
BREAKING: హీరో రాజ్ తరుణ్పై యువతి ఫిర్యాదు
TG: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య అనే యువతి ఫిర్యాదు చేశారు. ‘11 ఏళ్లుగా మేమిద్దరం ప్రేమలో ఉన్నాం. శారీరకంగానూ ఒక్కటయ్యాం. ఒకే ఇంట్లో ఉంటున్నాం. రాజ్ తన కొత్త సినిమాలో హీరోయిన్తో అఫైర్ పెట్టుకున్నాడు. అతడిని ప్రశ్నించినందుకు నన్ను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలి’ అని లిఖితపూర్వక ఫిర్యాదులో పోలీసులను కోరారు.
Similar News
News October 6, 2024
ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం!
AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి <<14238313>>ఇంటర్<<>> సిలబస్, పరీక్షల విధానాన్ని మార్చడంపై విద్యామండలి కసరత్తు చేస్తోంది. అన్ని సబ్జెక్టుల్లో ఒక మార్కు ప్రశ్నలు 20 ఇవ్వడంతోపాటు 2, 4, 8 మార్కుల విధానాన్ని తీసుకురానుంది. ప్రతి ప్రశ్నకు మరో ప్రశ్న ఛాయిస్గా ఉంటుంది. ఆర్ట్స్ గ్రూప్స్లో హిస్టరీ మినహా దాదాపు అన్ని సబ్జెక్టులకూ NCERT సిలబస్నే అమలుచేయనుంది. మ్యాథ్స్, కెమిస్ట్రీ సిలబస్ను కుదించనుంది.
News October 6, 2024
దసరా సెలవులు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి
దసరా సెలవులు ప్రారంభమవడంతో ఇంటి వద్ద ఉంటున్న పిల్లలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. నిన్న APలోని ఎమ్మిగనూరులో ఈతకు వెళ్లి ఒకరు, బహిర్భూమికి వెళ్లి నీటి కుంటలో పడి ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు. అలాగే ఫ్రెండ్స్తో ఆడుకుంటూ కూల్డ్రింక్ అనుకుని పురుగు మందు తాగి ఓ విద్యార్థి మరణించాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా తోటి పిల్లలతో కలిసి వాళ్లు ఏంచేస్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? అనేది పేరెంట్స్ గమనించాలి.
News October 6, 2024
రూ.20,000 సాయం కోసం మత్స్యకారుల ఎదురుచూపులు
AP: ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం కొనసాగుతుంది. ఈ సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు ఇవ్వాల్సిన జీవన భృతి ఇప్పటికీ అందలేదు. త్వరగా చెల్లించి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతుండగా, సంక్రాంతికి ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.10వేల చొప్పున లక్ష మందికి చెల్లించేది. రూ.20వేలు అందిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది.