News July 5, 2024
బ్రిటన్కు కొత్త ప్రధాని.. భారత్తో బంధం కొనసాగేనా?(2/2)
కశ్మీర్పై లేబర్ పార్టీ నేత జెరెమీ తీర్మానంతో డ్యామేజీ కలిగిందని తెలుసుకున్న PM అభ్యర్థి స్టార్మర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కశ్మీర్ అంశం భారత్ అంతర్గత సమస్య అని చెప్పారు. INDతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. దీపావళి, హోళీ వంటి హిందూ వేడుకల్లోనూ పాల్గొన్నారు. దీన్నిబట్టి ఆయన INDతో మంచి బంధాన్ని కొనసాగిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News October 6, 2024
US నేషనల్ క్రికెట్ ఓనర్షిప్లోకి సచిన్
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అమెరికా నేషనల్ క్రికెట్ లీగ్ (NCL) ఓనర్షిప్ గ్రూపులో చేరారు. 60 Strikes ఫార్మాట్లో జరిగే ఈ లీగులో విజేతకు ట్రోఫీ అందజేస్తారు. ‘నా లైఫ్లో అత్యుత్తమ జర్నీ క్రికెట్. US NCLలో చేరడం హ్యాపీగా ఉంది. కొత్త జనరేషన్లో ఈ టోర్నీ స్ఫూర్తి నింపుతుంది. అమెరికాలో క్రికెట్ వృద్ధిని గమనిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. సన్నీ, వెంగీ, రైనా, డీకే, ఉతప్ప ఇందులో భాగమవుతున్నారు.
News October 6, 2024
ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం!
AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి <<14238313>>ఇంటర్<<>> సిలబస్, పరీక్షల విధానాన్ని మార్చడంపై విద్యామండలి కసరత్తు చేస్తోంది. అన్ని సబ్జెక్టుల్లో ఒక మార్కు ప్రశ్నలు 20 ఇవ్వడంతోపాటు 2, 4, 8 మార్కుల విధానాన్ని తీసుకురానుంది. ప్రతి ప్రశ్నకు మరో ప్రశ్న ఛాయిస్గా ఉంటుంది. ఆర్ట్స్ గ్రూప్స్లో హిస్టరీ మినహా దాదాపు అన్ని సబ్జెక్టులకూ NCERT సిలబస్నే అమలుచేయనుంది. మ్యాథ్స్, కెమిస్ట్రీ సిలబస్ను కుదించనుంది.
News October 6, 2024
దసరా సెలవులు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి
దసరా సెలవులు ప్రారంభమవడంతో ఇంటి వద్ద ఉంటున్న పిల్లలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. నిన్న APలోని ఎమ్మిగనూరులో ఈతకు వెళ్లి ఒకరు, బహిర్భూమికి వెళ్లి నీటి కుంటలో పడి ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు. అలాగే ఫ్రెండ్స్తో ఆడుకుంటూ కూల్డ్రింక్ అనుకుని పురుగు మందు తాగి ఓ విద్యార్థి మరణించాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా తోటి పిల్లలతో కలిసి వాళ్లు ఏంచేస్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? అనేది పేరెంట్స్ గమనించాలి.