News July 5, 2024
రేపు పులివెందులకు వైఎస్ జగన్
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపటి నుంచి 3 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం నియోజకవర్గానికి వెళ్లనున్న ఆయన.. 2 రోజులు కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News October 6, 2024
రూ.20,000 సాయం కోసం మత్స్యకారుల ఎదురుచూపులు
AP: ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం కొనసాగుతుంది. ఈ సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు ఇవ్వాల్సిన జీవన భృతి ఇప్పటికీ అందలేదు. త్వరగా చెల్లించి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతుండగా, సంక్రాంతికి ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.10వేల చొప్పున లక్ష మందికి చెల్లించేది. రూ.20వేలు అందిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది.
News October 6, 2024
రికార్డుల గురించి ఆలోచించను: రూట్
జట్టు విజయానికి సహకరించడమే తనను ముందుకు నడిపిస్తుందని ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ అన్నారు. వ్యక్తిగతంగా ఆటను ఆస్వాదిస్తానని, తానెప్పుడూ రికార్డుల గురించి ఆలోచించనని పేర్కొన్నారు. తాను క్రికెట్ ఆడుతున్నంత వరకు టెస్టుల్లో ఇంగ్లండ్కు ప్రాతినిధ్యం వహిస్తానని తెలిపారు. కాగా, టెస్టుల్లో రూట్ మరో 71 రన్స్ చేస్తే అలిస్టర్ కుక్ (12,472)ను అధిగమించి అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగా నిలుస్తారు.
News October 6, 2024
ఘోరం.. కుటుంబంలో ఒక్కడే మిగిలాడు!
AP: ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబంలో చీకట్లు నింపింది. చిత్తూరు జిల్లాలోని జీడీనెల్లూరుకు చెందిన దినేశ్ బెట్టింగ్కు అలవాటు పడి ఏడాది క్రితం ఇంటి స్థలాన్ని అమ్మేశాడు. అయినా వదలక మరిన్ని అప్పులు చేశాడు. సొంతింటిపై లోన్ కోసం ప్రయత్నించాడు. అప్పు తీర్చే మార్గం లేక దినేశ్, తండ్రి నాగరాజుల రెడ్డి, తల్లి జయంతి, సోదరి సునీత శుక్రవారం పురుగు మందు తాగారు. ముగ్గురు చనిపోగా, దినేశ్ పరిస్థితి విషమంగా ఉంది.