News July 5, 2024

శ్రీకాకుళం: జాబ్ మేళా.. 16 మంది ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించగా.. నిరుద్యోగ యువత 88 మంది హాజరయ్యారు. ఇందులో 16 మందిని ఎంపిక చేసి, వారికి ఉపాధి కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సుధా తెలిపారు.

Similar News

News March 22, 2026

హిరమండలం: యువతిని ప్రేమించాడు.. కులం పేరుతో దూషించాడు.. జైలు

image

హిరమండలం మండలం నిమ్మలపాడు గ్రామానికి చెందిన గిరిజన యువతిని కులం పేరుతో దూషించినందుకు పోలాకి మండలానికి చెందిన దుర్గారావుకు శ్రీకాకుళం కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్సై హేమంత్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గిరిజన యువతిని ప్రేమ పేరుతో దుర్గారావు మోసం చేశాడు. పెళ్లి చేసుకోమని మహిళ అడగగా కులం పేరుతో దూషించాడని ఎస్ఐ చెప్పారు. దీనిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు.

News March 22, 2026

శ్రీకాకుళం: ‘మహిళల కోసం పింక్ టాయిలెట్స్’

image

శ్రీకాకుళం జిల్లాకు ఆర్టీసీ బస్సు స్టాండ్ సమీపంలోని డే అండ్ నైట్ కూడలి మార్గంలో ఉమెన్స్ కాలేజీ వద్ద మహిళల కోసం ఫీడింగ్ రూమ్, పింక్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే శంకర్ శనివారం రాత్రి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..పలు ప్రాంతాల నుంచి శ్రీకాకుళానికి బస్సుల్లో పనులు నిమిత్తం వస్తున్న మహిళల ఇబ్బందుల దృష్ట్యా వీటిని ఏర్పాటు చేశామన్నారు.

News March 22, 2026

పలాస: ప్రసవం తర్వాత బాలింత మృతి..!

image

పలాస CHCలో బాలింత మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పలాస(M) దానకొరకు చెందిన మీనా ప్రభుత్వాసుపత్రిలో ఉదయం 9 గం.కు రెండో బిడ్డకు జన్మనిచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంటకు మీనా మెలకువలోకి వచ్చింది. కాసేపటికే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. వైద్యలు వివిధ పరీక్షలు చేసి చికిత్స అందించినా రక్షించలేకపోయారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, కార్బొఎంబోలిజం కారణంగా మృతిచెందిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ పాపినాయుడు తెలిపారు.