News July 5, 2024
గజ్వేల్: యువకుడి ఆత్మహత్య
యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గజ్వేల్ నియోజకవర్గంలో జరిగింది. స్థానికులు వివరాలు.. ఎల్కల్ గ్రామానికి చెందిన మంది రాజు (35) శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 6, 2024
సంగారెడ్డి: రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు
సంగారెడ్డి జిల్లాలోని రైతులకు 18వ విడత పీఎం కిసాన్ నిధులు రైతులకు సంబంధించిన ఖాతాలలో జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిధులను వ్యవసాయ పనులకు వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు నిధులు జమ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు.
News October 6, 2024
దసరాకు ముస్తాబైన జ్వాలాముఖి ఆలయం
కంగ్టి మండలంఎడ్ల రేగడి తండాలోని జ్వాలాముఖి ఆలయాన్ని దసరా పండుగకు ముస్తాబు చేసినట్టు ఆలయ ప్రధాన పూజారి శ్రీ మంగళ్ చంద్ మహారాజ్ తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు జాతర ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొంటారని పేర్కొన్నారు. మంగళవారం జ్వాలాముఖి దేవికి హోమం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
News October 5, 2024
పిల్లల భద్రత.. మన అందరి బాధ్యత: సిద్దిపేట సీపీ
దసరా సెలవుల దృష్ట్యా పిల్లల భద్రత పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, భవిష్యత్తు భారతావనికి వారే పునాదులని, వారిని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. ప్రతి సంవత్సరం దసరా సెలవుల్లో ఎంతో మంది అమాయక విద్యార్థులు ఆకారణంగా ప్రాణాలు పోగొట్టుకొని కన్నా వారికీ కడుపుకోత మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.