News July 5, 2024
కాటేసిన పామును కొరికి చంపిన వ్యక్తి

తనను కాటేసిన పామును వ్యక్తి కొరికి చంపిన ఘటన బిహార్ రాజౌలీలో జరిగింది. రైల్వే లైన్ పని చేస్తున్న కార్మికుడు సంతోష్ను పాము కరిచింది. గమనించిన అతడు దాన్ని పట్టుకొని మూడుసార్లు కొరకడంతో అది చనిపోయింది. అధికారులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే కరిచిన పామును తిరిగి కొరికితే విషం విరుగుడు అవుతుందని తమ ఊరిలో నమ్ముతారని అతడు చెప్పడం గమనార్హం.
Similar News
News December 27, 2025
ఏలూరు జిల్లాలో ఒక రోజు ముందే రూ.113 కోట్ల పంపిణీ

జనవరి నెల సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 31 వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,59,151 లక్షల మంది పెన్షన్ దారులకు 113.68 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో పెన్షన్ 31వ తేదీన 100% పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. 31న తీసుకొని వారికి 2వ తేదీన పంపిణీ చేస్తారన్నారు.
News December 27, 2025
అల్లు అర్జున్ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?

‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటనపై పోలీసులు <<18684964>>ఛార్జ్షీట్<<>> దాఖలు చేయడంపై మరోసారి హీరో అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనను ఏ-11గా పేర్కొనడంతో బన్నీని మళ్లీ అరెస్ట్ చేస్తారా? అని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఛార్జ్షీట్ అనేది కేసు పూర్తి వివరాలతో కోర్టుకు సమర్పించే నివేదిక. ఇక్కడ సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు అందులో పేర్కొనడంతో బన్నీ అరెస్ట్ ఉండకపోవచ్చు!
News December 27, 2025
రాష్ట్రంలోనే ‘ఉపాధి’ పథకం ప్రారంభం.. CWCలో చర్చ

AP: MGNREGA స్కీమ్ ఏర్పాటై 2026 ఫిబ్రవరి 2కు 20 ఏళ్లు పూర్తి అవుతుంది. అనంతపురం జిల్లా బండ్లపల్లిలో నాటి PM మన్మోహన్, సోనియా దాన్ని ప్రారంభించారు. కాగా NDA ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై వివాదం మొదలైంది. దీనిపై CWC భేటీలో చర్చించినట్లు PCC EX చీఫ్ రుద్రరాజు తెలిపారు. JAN 5 నుంచి చేపట్టే ఉద్యమంలో భాగంగా బండ్లపల్లిలో సభ నిర్వహించాలని, దీనికి రావాలని సోనియాను కోరామని తెలిపారు.


