News July 6, 2024

తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి నిలపాలి: కలెక్టర్ అన్సారియా

image

తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక దృష్టి నిలపాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శుక్రవారం ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్‌లో ఒంగోలు కార్పొరేషన్‌తో సహా అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలలో ఇళ్లకు సరఫరా చేస్తున్న తాగునీటి సరఫరా వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 2, 2026

ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి: మంత్రి స్వామి

image

అంగన్వాడీ కార్యకర్తలు, చిరుద్యోగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి స్వామి ఆదివారం తెలిపారు. చరిత్రలో తొలిసారిగా అంగన్వాడీ వేతనాలను రెండుసార్లు పెంచిన ఘనత CM చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

News March 1, 2026

ప్రకాశం: యువతి ఏకాంత వీడియోలతో బ్లాక్‌మెయిల్

image

వివాహిత పర్సనల్ వీడియోలు ఆమె భర్త‌, తండ్రికి పంపి బెదిరిస్తున్న మాజీ ప్రియుడిపై గుంటూరు PSలో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. కొరిటెపాడుకి చెందిన ఓ యువతి, ప్రకాశం (D) యువకుడు కళాశాల రోజుల్లో ప్రేమించుకున్నారు. ఆ యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో మాజీ ప్రియుడు ప్రేమించే సమయంలో యువతిని ఏకాంతంగా కలిసిన వీడియోలను భర్త, తండ్రికి పంపాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 1, 2026

మార్కాపురం: ‘కళాశాలే లేదు.. పరీక్షలు మాత్రం రాస్తారు’

image

మార్కాపురంలో BED పరీక్షలు జరుగుతున్నాయి. సుమారు 10 కళాశాలలకు సంబంధించిన విద్యార్థులకు 5 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే వారు చదువుతున్న కళాశాల ఎక్కడో వారికే తెలీదు. మధ్యవర్తులు హాల్ టికెట్ ఇస్తే పరీక్ష రాస్తారు అంతే. కళాశాల భవనాలు కూడా ఉండవు కానీ అందుకు సంబంధించిన పత్రాలు మాత్రం ఉంటాయి. ఇలాంటి ఆఫర్ ఇతర రాష్ట్రాల వారికేనట. ఈ పరిస్థితి కందుకూరులోనూ ఉన్నట్లు తెలుస్తోంది.