News July 6, 2024
ఇకపై విద్యార్థులకు నేరుగా కాస్మొటిక్ వస్తువులు
AP: గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను(పేస్ట్, బ్రష్, షాంపూ వగైరా) నేరుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అయ్యే మొత్తాన్ని గత ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో జమచేసే విధానం తెచ్చినా రెగ్యులర్గా చేయలేదట. దాదాపు రూ.10కోట్ల బకాయిలున్నట్లు తేల్చింది. దీంతో ఇకపై వస్తువుల్ని నేరుగా ఇవ్వాలని నిర్ణయించింది. 548 పాఠశాలల్లో 1.25లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
Similar News
News October 14, 2024
పంచాయతీలను జగన్ నిర్వీర్యం చేశారు: నిమ్మల
AP: సంక్రాంతిలోపు 3వేల కి.మీల సిమెంట్ రోడ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోరింటాడలో పల్లెపండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీ నిధుల్ని దారి మళ్లించిన జగన్ చరిత్రలో ద్రోహిగా మిగిలిపోయారని విమర్శించారు. పంచాయతీలను నిర్వీర్యం చేసి, సర్పంచులను భిక్షాటన చేసే దుస్థితికి తెచ్చారని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందన్నారు.
News October 14, 2024
కడప: ఉచితంగా డీఎస్సీ శిక్షణా కార్యక్రమం
కడప జిల్లా పరిధిలోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ కార్యక్రమం అందిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి తెలియజేశారు. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్సైట్లో అక్టోబర్ 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News October 14, 2024
డీఎస్సీ ఫ్రీ కోచింగ్.. ఆ అభ్యర్థులకు గమనిక
AP: డీఎస్సీ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఈ నెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అప్లై చేసిన వారు జ్ఞానభూమి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలంది. ఈ నెల 27న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపింది. అర్హులను ఎంపిక చేసి శిక్షణ అందిస్తామంది.