News July 6, 2024
సిద్దిపేట: RTC బస్సు ఢీకొని HM మృతి
రోడ్డు ప్రమాదంలో ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన ఘటన చేర్యాలలో జరిగింది. SI దామోదర్, స్థానికుల వివరాల ప్రకారం.. సిద్దిపేట వాసి K.చంద్రశేఖర్(59) DNT స్కూల్లో గెజిటెడ్ HMగా పని చేస్తున్నారు. శుక్రవారం బైక్పై పాఠశాలకు బయలుదేరిన ఆయనను చేర్యాల వద్ద వెనుకనుంచి వస్తున్న RTC బస్సు ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన చంద్రశేఖర్ను HYD తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News October 2, 2024
MDK: పల్లెల్లో బతుకమ్మ పండుగ సందడి
ఉమ్మడి మెదక్ జిల్లాలో బతుకమ్మ, దసరా పండుగ సందడి మొదలైంది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఈరోజు పాఠశాలల్లో బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు హాస్టల్ నుంచి స్వగ్రామాలకు వెళ్తుండడంతో రద్దీగా ఏర్పడింది. గ్రామాల్లో బతుకమ్మ పండుగ పురస్కరించుకొని తంగేడు, గునుగు, వివిధ రకాల పూల సేకరణలో నిమగ్నమయ్యారు.
News October 1, 2024
MDK: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!
సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతితోపాటు మాంసాహారం, మందు షాపులు బంద్ కానున్నాయి. దీంతో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ప్రజలు పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అనే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని అంటున్నారట.
News October 1, 2024
MDK: డీఎస్సీలో సత్తా చాటిన అభ్యర్థులు
సోమవారం విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి మెదక్ అభ్యర్థులు సత్తా చాటారు. చిలపిచెడ్ మండలం రహీంగూడకు చెందిన జూల లింగం(SGT), అక్కన్నపేటకు చెందిన జంగం నవీన్( ఫిజికల్ సైన్స్) మెదక్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. హత్నూర మండలం కాసాలకు చెందిన పన్యాల సాయికృష్ణ SGT సాంఘిక శాస్త్రంలో జిల్లాలోనే 2వ ర్యాంక్ సాధించగా.. అక్కన్నపేటకు చెందిన శ్రీధర్ గౌడ్ అనే యువకుడు(సాంఘిక శాస్త్రం) ఆరో ర్యాంకు సాధించారు.