News July 6, 2024
జమ్మికుంట: 14 ఏళ్లకు పిల్లలను కలిశాడు!

జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లె గ్రామానికి చెందిన సారయ్య- సత్తమ్మ భార్యాభర్తలు. వీరి ఇద్దరి మధ్య 2010లో చిన్న గొడవ జరగగా సత్తమ్మ మృతి చెందింది. దీంతో సారయ్య 14 ఏళ్ల పాటు జైలులో ఉన్నాడు. ఇద్దరు పిల్లలు అనాథశ్రమంలో చేరారు. సారయ్య సత్ప్రవర్తన కింద ఈ నెల 3న విడుదలయ్యాడు. అనాథశ్రమంలో ఉన్న పిల్లలను కలిశాడు. పిల్లలను తన వెంట తీసుకెళ్తానని తెలపడంతో ఆశ్రమ నిర్వాహకులు కంటనీరు పెట్టి తండ్రితో పంపించారు.
Similar News
News March 11, 2026
కరీంనగర్లో ‘ఈ-ఆఫీస్’ సేవలు ప్రారంభం

పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థలో ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ సేవలను ఆయన ప్రారంభించారు. ఇకపై అన్ని విభాగాల్లో ఫైళ్లను, ప్రజల ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారానే వేగంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పారదర్శక పాలన కోసమే ఈ డిజిటల్ సంస్కరణలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
News March 10, 2026
KNR: ఐస్క్రీం తయారీ కేంద్రంపై దాడులు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ‘ఉత్తమ్ ఐస్ క్రీమ్’ తయారీ కేంద్రాన్ని జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారులు తనిఖీ చేశారు. ప్యాకింగ్పై చిరునామా, FSSAI లైసెన్స్ నంబర్లు లేకపోవడం, తప్పుడు కేటగిరీలో లైసెన్స్ పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.6,000 విలువైన స్టాక్ను సీజ్ చేసిన అధికారులు, తయారీదారులు వెంటనే లైసెన్సులు పొందాలని ఆదేశించారు.
News March 9, 2026
ప్రజావాణికి 352 దరఖాస్తులు: కలెక్టర్ చిత్రా మిశ్రా

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి, గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి 352 దరఖాస్తులను స్వీకరించారు. వృద్ధులు, దివ్యాంగుల వద్దకే వెళ్లి స్వయంగా వినతులు స్వీకరించిన కలెక్టర్.. సమస్యలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు స్పష్టం చేశారు.


