News July 6, 2024
ఒంగోలు: యువకుడిపై విచక్షణారహితంగా కర్రలతో దాడి

ఒంగోలులో ఓ యువకుడిపై పలువురు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేసి, గొంతుకు తాడు బిగించి హత్యయత్నానికి పాల్పడ్డారు. గ్యాస్ డెలివరీ బాయ్ డేనియల్ సన్నిహితంగా ఉంటున్న యువతి ఇంటికి బుధవారం రాత్రి మద్యం తాగి వెళ్లాడు. అక్కడ యువతి సంబంధీకులు ఆ యువకుడిని కొట్టినట్లు తెలుస్తోంది. యువతి ఇంటిముందు అతడు గాయాలతో ఉండటాన్ని గమనించిన స్థానికులు డానియల్ తల్లికి సమాచారం అందించి ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 8, 2026
మీ సమస్యలను సీఎంకు చెబుతా: గొట్టిపాటి

ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పలువురు రైతులు మంత్రి గొట్టిపాటికి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. సిగరెట్లపై ఎక్సైజ్ పన్ను భారీగా పెంచడంతో డిమాండ్ తగ్గి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
News January 8, 2026
మీ సమస్యలను సీఎంకు చెబుతా: గొట్టిపాటి

ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పలువురు రైతులు మంత్రి గొట్టిపాటికి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. సిగరెట్లపై ఎక్సైజ్ పన్ను భారీగా పెంచడంతో డిమాండ్ తగ్గి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
News January 7, 2026
చంద్రబాబును కలిసిన ఎంపీ మాగుంట

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ వద్ద స్వాగతం పలికి పుష్పగుచ్ఛాన్ని అందించారు. కాగా ఢిల్లీలో ఉన్న మాగుంట ఈనెల 9న ఒంగోలుకు రానున్నారు. 9, 10న స్థానికంగా జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10న ఒంగోలు పీవీఆర్ బాలుర మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతారు.


