News July 6, 2024
గ్రూప్-2 పరీక్ష వాయిదాకు ప్రభుత్వం నిర్ణయం?

TG: రాష్ట్రంలో జులైలో డీఎస్సీ, ఆగస్టులో గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయి. వెనువెంటనే ఎగ్జామ్స్ నిర్వహించడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, రెండు రోజుల గ్యాప్తో ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలకు షెడ్యూల్ వెలువడిన విషయం తెలిసిందే.
Similar News
News November 3, 2025
శీతాకాలం అతిథుల రాక మొదలైంది: పవన్

AP: పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథులైన ఫ్లెమింగ్ పక్షుల రాక మొదలైందని Dy.CM పవన్ అన్నారు. ‘ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్ను మారుస్తాం. ఫ్లెమింగోలు ఆహారం, విశ్రాంతి కోసం అక్టోబరులో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లిపోతాయి. వాటికి ఇబ్బందులు కలగకుండా కొంత కాలంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈసారి 3 రోజుల పండుగతో సరిపెట్టకుండా ఎకో టూరిజాన్ని విస్తరిస్తాం’ అని పవన్ చెప్పారు.
News November 3, 2025
ముంబైలో 70KMల అండర్ గ్రౌండ్ టన్నెల్: MMRDA

నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ముంబై రోడ్లపై ప్రయాణమంటే అక్కడి వారికి రోజూ నరకమే. దాన్నుంచి తప్పించేందుకు MMRDA ఏకంగా 70KM మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ మార్గాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించి ఫీజిబిలిటీ రిపోర్టును రూపొందిస్తోంది. మూడు ఫేజ్లుగా నిర్మాణం జరగనుంది. అక్కడ నిర్మిస్తున్న అంతర్గత టన్నెల్ మార్గాలకు వేరుగా దీన్ని నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రయాణం సాఫీ అవుతుంది.
News November 3, 2025
ఎన్ని అవాంతరాలు ఎదురైనా SLBC పూర్తి చేస్తాం: CM

TG: SLBC టన్నెల్ పనులపై BRS నేతలు రాజకీయాలు చేయడం తగదని CM రేవంత్ అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ మన్నేవారిపల్లిలో పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘SLBC పనులను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. పదేళ్లలో 10kms కూడా పూర్తి చేయలేదు. కమీషన్లు రావని ఈ ప్రాజెక్టును పక్కనపెట్టారు’ అని విమర్శించారు.


