News July 6, 2024

KTDM: గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థి మృతి

image

గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాలిలా.. తేజావత్ హరికృష్ణ (13) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. స్కూల్లో ఛాతీ నొప్పి రావడంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హరి మృతిచెందినట్లు చెప్పారు. కాగా ఆ బాలుడు చిన్నతనం నుంచే గుండెజబ్బుతో బాధపడుతున్నాడు.

Similar News

News March 2, 2026

99 రోజుల ప్రగతి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్‌

image

ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు సాగే ఈ కార్యాచరణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు.

News March 2, 2026

‘PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

image

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి పాలన కార్యాచరణపై సమీక్షించారు. సోలార్ ప్యానెల్ అవసరమైన వారు www.pmsuryaghar.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News March 2, 2026

పరీక్షలంటే భయం వద్దు: కలెక్టర్

image

పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంత చిత్తంతో పరీక్షలకు సిద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మోటివేషన్ కార్యక్రమంలో మాట్లాడారు.పరీక్షల పట్ల భయం పెంచుకుంటే ఉన్న సమయాన్ని వృథా చేసుకోవడమే కాకుండా, తెలిసిన విషయాలను కూడా మర్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.