News July 6, 2024
పవన్ ఎఫెక్ట్.. పిఠాపురంలో భారీగా పెరిగిన భూముల ధరలు

AP: డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురంలోని భోగాపురం, ఇల్లింద్రాడ పరిధిలో 3.52 ఎకరాలు కొనడంతో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయాయట. గతంలో ఎకరం రూ.15-16లక్షలు, NH216కు దగ్గరలో అయితే రూ.50 లక్షల వరకు ఉండేది. పవన్ రాకతో ఇప్పుడు ఎకరం విలువ రూ.కోటి దాటిందని, కొన్నిచోట్ల రూ.2-3 కోట్ల వరకు రేటు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. రియల్టర్లు ఆ ప్రాంతంలో భారీగా భూములు కొనేందుకు రైతుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట.
Similar News
News January 16, 2026
కనుమ రోజున పశువులను ఎలా పూజించాలి?

పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటేనే రైతుకి ఉత్సాహం. పంట చేతికి రావడంలో వాటి పాత్ర కీలకం. తమకు సుఖ,సంతోషాలను అందించడానికి అహర్నిశలు కష్టపడే పశువులను రైతులు మరచిపోరు. తమకు జీవనాధారమైన మూగజీవాల పట్ల కృతజ్ఞతగా అన్నదాతలు ‘కనుమ’ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. ఈ రోజు పశువులను ఎలా పూజిస్తే వ్యవసాయం మరింత సుభిక్షంగా ఉంటుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ <<>>క్లిక్ చేయండి.
News January 16, 2026
T20 వరల్డ్కప్లో సుందర్ ఆడటం కష్టమే!

టీమ్ ఇండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి ఇప్పటికీ కోలుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్తో చివరి రెండు వన్డేలకు దూరమైన సుందర్, ఇప్పుడు టీ20లకూ అందుబాటులో లేరు. ఈ విషయాన్ని ఇటీవల బీసీసీఐ తెలిపింది. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే T20 వరల్డ్కప్కు కూడా పూర్తి ఫిట్నెస్ సాధించడం కష్టమని నివేదికలు చెబుతున్నాయి. దీంతో జట్టులో ఆయన స్థానం అనుమానంగానే మారింది.
News January 16, 2026
గ్రీన్లాండ్కు భారీగా యూరోపియన్ సైనిక బలగాలు

గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని US అధ్యక్షుడు ట్రంప్ <<18784880>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో యూరోపియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. డెన్మార్క్కు మద్దతుగా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నార్వే సహా పలు దేశాలు గ్రీన్లాండ్కు సైనిక బలగాలను పంపుతున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్ సైనికులు గ్రీన్లాండ్ రాజధాని నూక్ చేరుకోగా, జర్మనీ సైతం సైనిక బృందాన్ని మోహరించింది. నాటో దేశాల ఐక్యతను చూపించేందుకే ఈ బలగాల మోహరింపు అని సమాచారం.


