News July 6, 2024

పాపం.. నీళ్లు పట్టుకున్నాడని కూలీని కొట్టి చంపారు

image

TG: మెదక్ జిల్లా టేక్మాల్(M) పరిధిలోని బోడగట్టుకు చెందిన సాయిలు(35) భార్య, పిల్లలతో HYDలో ఉంటూ కూలిపని చేస్తున్నారు. అడ్డా మీద దాహం వేయడంతో ఓ టీ స్టాల్‌కి వెళ్లి బాటిల్‌లో నీరు పట్టుకున్నారు. ‘దాహం వేస్తే తాగు. కానీ బాటిల్లో ఎందుకు నింపుకున్నావు’ అని టీ స్టాల్‌లోని సతీశ్ అనగా గొడవ మొదలైంది. సతీశ్ స్నేహితులు వచ్చి సాయిలును తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News January 13, 2026

రేపే మకరజ్యోతి దర్శనం

image

శబరిమలలో రేపు మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. సాయంత్రం 6:25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే ఈ జ్యోతిగా దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు. కాగా రేపు వర్చువల్ క్యూ ద్వారా 30,000 మందికే అనుమతి ఉంది. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఇప్పటికే దేవస్వం బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జనవరి 19 రాత్రి వరకు అయ్యప్ప దర్శనానికి అవకాశం ఉండగా 20వ తేదీన ఆలయం మూసివేయనున్నారు.

News January 13, 2026

మేడారం మహాజాతర.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి

image

TG: మేడారం భక్తుల కోసం ‘MyMedaram’ పేరిట వాట్సాప్‌ సేవలను మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి ప్రారంభించారు. 7658912300 నంబర్‌కు మెసేజ్‌ చేస్తే రూట్ మ్యాప్‌లు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చని తెలిపారు. తప్పిపోయిన వారి సమాచారం, ఫిర్యాదులు వంటి వివరాలు ఇందులో లభిస్తాయి. ఈ సేవలు వెబ్‌సైట్‌, మొబైల్ యాప్‌తో పాటు వాట్సాప్‌లోనూ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

News January 13, 2026

కిటికీకి ఎదురుగా మరో కిటికీ ఉండవచ్చా?

image

నివాస గృహాలలో ఓ కిటికీకి ఎదురుగా మరో కిటికీ ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఆరోగ్యం, ప్రశాంతత సొంతమవుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఈ నిర్మాణం గాలి ప్రవాహాన్ని మెరుగుపరచి, గదుల ఉష్ణోగ్రత క్రమబద్ధంగా ఉంచుతుంది. సరైన వెలుతురు ప్రసరిస్తుంది. తద్వారా దైవకళతో ఉట్టిపడుతుంది. ఇది పని పట్ల ఏకాగ్రతను పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>