News July 6, 2024
మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ న్యాయవాది అరెస్ట్

భద్రాచలంలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ న్యాయవాదిని పట్టణ పోలీసులు అరెస్టు చేసి సబ్ జైలుకు తరలించారు. కొంతకాలం క్రితం ఓ మహిళ తన కుటుంబ వివాద పరిష్కారం కోసం కృష్ణ ప్రసాద్ అనే న్యాయవాదిని సంప్రదించింది. ఈ క్రమంలో అతను మహిళకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా.. న్యాయవాదిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.
Similar News
News January 1, 2026
టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS : సీపీ

JAN 3 నుండి 20 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాలలో నిర్వహించే టీజీ టెట్ పరీక్షల సందర్భంగా అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అటు సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.
News January 1, 2026
అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం

ఖమ్మం నగరంలోని అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ సభ్యులు గురువారం ఆలయ ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ గౌరవ అధ్యక్షుడిగా బొల్లి కొమరయ్య, గౌరవ సలహాదారుగా పల్లెబోయిన చంద్రయ్య, దండా జ్యోతి రెడ్డి, అధ్యక్షుడిగా అల్లిక అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా బెల్లి కొండల్ రావు, కోశాధికారిగా పల్లపు సత్యంతో పాటు ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వరరావు, వీరబాబు, మణికంఠ, వెంకటేశ్వర్లు ప్రమాణం చేశారు.
News January 1, 2026
ఖమ్మం: ఐదేళ్లుగా అసంపూర్తిగానే అగ్రహారం అండర్ బ్రిడ్జి!

ఖమ్మం-బోనకల్ రహదారిలోని అగ్రహారం వద్ద రూ.18.50 కోట్లతో చేపట్టిన అండర్ బ్రిడ్జి (RUB) పనులు ఐదేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. 2021లో శంకుస్థాపన చేసినా, కోవిడ్, విజయవాడ-కాజీపేట మూడో రైల్వే లైన్ అలైన్మెంట్ మార్పు వల్ల పనులు నిలిచిపోయాయి. దీనివల్ల వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వంతెన పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.


