News July 6, 2024
ఇకపై ఈవీ ఛార్జ్కు 5 నిమిషాలే!
గంటల పాటు వేచి చూడనవసరం లేకుండా 5 నిమిషాల్లోనే ఈవీ బ్యాటరీ ఛార్జ్ అయ్యే టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది. నైబోల్ట్ అనే యూకే సంస్థ 4.5 నిమిషాల్లో 70% ఛార్జ్ అయ్యే కారును రూపొందించింది. దీని కోసం ప్రత్యేకంగా 35కిలోవాట్ల లిథియమ్ అయాన్ బ్యాటరీని డిజైన్ చేసింది. మరోవైపు న్యూయార్క్లోని కార్నెల్ యూనివర్సిటీ కొన్ని నెలల క్రితం 5 నిమిషాల్లో ఛార్జ్ అయ్యే బ్యాటరీని డిజైన్ చేసింది.
Similar News
News October 14, 2024
ఎల్లుండి బ్రేక్ దర్శనాలు రద్దు: TTD
తిరుమలలో ఈ నెల 16న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. రాగల 48 గంటల్లో భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ అంచనాలతో భక్తుల భద్రత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 15న సిఫార్సు లేఖలను స్వీకరించబోమని వెల్లడించింది.
News October 14, 2024
‘INDIA’ కోసం రంగంలోకి సునీల్ కనుగోలు
మహారాష్ట్ర ఎన్నికల్లో INDIA కూటమి గెలుపు కోసం వ్యూహకర్త సునీల్ కనుగోలు రంగంలోకి దిగారు. హరియాణాలో జాట్ల ఓట్ల సమీకరణ క్రమంలో మిగతా వర్గాలు దూరమవ్వడం కాంగ్రెస్ కొంపముంచింది. దీంతో MHలో అందరికీ సమ ప్రాధాన్యం ఇవ్వడం సహా, అసంతృప్తి నేతలను మచ్చిక చేసుకొనే వ్యూహాలను పార్టీ ముందుంచినట్టు తెలిసింది. హరియాణాలో కాంగ్రెస్ రెబల్స్కు BJP సహకరించడం వల్లే ఓడిపోయామని కాంగ్రెస్ భావిస్తోంది.
News October 14, 2024
సంగీతంతో మొక్కలు వేగంగా పెరుగుతాయ్!
సంగీతానికి రాళ్లు కరిగించే శక్తి ఉంటుందంటారు. అదే సంగీతం మొక్కలను వేగంగా పెరిగేలా చేస్తుందనే విషయాన్ని పరిశోధకులు నిరూపించారు. మ్యూజిక్ ప్లే చేయడం ద్వారా మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే ఫంగస్ కార్యాచరణను ప్రేరేపించవచ్చని తేలింది. శిలీంధ్రాలున్న పాత్రల చుట్టూ సౌండ్ బూత్లను అమర్చి పరీక్షించారు. 5 రోజుల తర్వాత శిలీంధ్రాలలో పెరుగుదల& బీజాంశం ఉత్పత్తిలో వేగం కనిపించింది.