News July 6, 2024
PHOTOS: కార్యకర్తలు, ఫ్యాన్స్తో జగన్

AP: మాజీ సీఎం జగన్ ఇవాళ కడప ఎయిర్పోర్ట్ నుంచి పులివెందుల మార్గమధ్యంలో వైసీపీ కార్యకర్తలు, ప్రజలను పలకరించారు. ఈ సందర్భంగా ఆయనతో పలువురు అభిమానులు ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వైసీపీ Xలో పోస్ట్ చేసింది.
Similar News
News March 9, 2026
వార్ ఎఫెక్ట్: భారీగా పడిపోతున్న గుడ్లు, అరటి రేట్లు

AP: ఇరాన్ వార్ ఎఫెక్టుతో రాష్ట్ర ఎగుమతుల రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. గల్ఫ్ దేశాలకు గుడ్లు, రొయ్యలు వంటి ఎగుమతుల్లో 54% వాటా AP, TN, TGలవే. ఇందులో AP వాటానే 20%. అలాగే రాయలసీమ నుంచి అరటి గల్ఫ్కు వెళ్తుంటుంది. ఎగుమతులు నిలిచి స్థానికంగా గుడ్డు ధర ₹3కి, అరటి KG ₹10కి పడిపోయాయి. రొయ్యదీ అదే స్థితి. అటు 40% నాన్ బాస్మతి బియ్యం ఎగుమతీ ఆగిపోయింది. 4L టన్నుల బియ్యం పోర్టుల్లో నిలిచిపోయింది.
News March 9, 2026
APలో 1053 KM మేర ‘గ్రేట్ గ్రీన్ వాల్’

AP: సముద్ర కోత నివారణకు తీరం వెంబడి 5KM వెడల్పుతో 1053 KM మేర ‘గ్రేట్ గ్రీన్ వాల్’ నిర్మాణం కానుందని కేంద్రం లోక్సభలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను AP సిద్ధం చేసినట్లు తెలిపింది. తుఫాన్లు, సునామీల నుంచి రక్షణ, సముద్రపు కోత నివారణకు వీలవుతుందని పేర్కొంది. కాకినాడ నుంచి ఉప్పాడ వరకు రూ.323 కోట్లతో, విశాఖ తీరప్రాంతంలో రూ.200 కోట్లతో కోతను నియంత్రించడానికి DPRలు పూర్తయినట్లు వివరించింది.
News March 9, 2026
స్కూళ్లు, హాస్టళ్లలో స్టీమ్ రైస్ అన్నం

TG: స్కూళ్లు, హాస్టళ్లలో స్టీమ్ రైస్ అన్నాన్ని వడ్డించాలని GOVT నిర్ణయించింది. ఇప్పుడు పెడుతున్న బియ్యంతో అన్నం ముద్దగా అయి విద్యార్థులు తినడం లేదు. ప్రత్యామ్యాయంగా స్టీమ్ రైస్ అన్నాన్ని కొన్నిచోట్ల పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయించింది. ఈ రైస్ అన్నం ముద్ద కాకపోవడంతో పాటు పోషకాలతో పొడిగా ఉండడంతో వారు ఇష్టంగా తింటున్నారు. దీంతో ఇకపై ఇవే బియ్యాన్ని అన్ని హాస్టళ్లు, స్కూళ్లకు అందించాలని ఆదేశించింది.


