News July 7, 2024
ఖమ్మం జిల్లాలో 31.06 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యం:కలెక్టర్
ఖమ్మం: వర్షాలు మొదలవడంతో ప్లాంటేషన్ ఒక పండుగలా చేపడుతున్నట్లు రాష్ట్ర ఆటవీ ముఖ్య సంరక్షణ అధికారిణి ప్రియాంక వర్గీస్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ నందు వనమహోత్సవంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 31.06 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యమని.. ఈ లక్ష్యాన్ని వివిధ శాఖల ద్వారా పూర్తి చేయుటకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు.
Similar News
News October 8, 2024
KMM: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
News October 7, 2024
కొత్తగూడెం: ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెం రుద్రంపూర్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆరు కొత్త కోర్సులలో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆగస్టు 1 నాటికి 14 సంవత్సరాలు నిండిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.
News October 7, 2024
ఖమ్మం: నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు: ట్రాఫిక్ ఏసీపీ
ఖమ్మంలో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ACP శ్రీనివాసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో వాహన తనిఖీల్లో భాగంగా నంబర్ ప్లేట్ లేని 55 బైకులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం పట్టుబడిన వాహన పత్రాలు, ఛాసిస్ నంబర్లు తనిఖీ చేస్తూ చోరికి గురైన వాహనాలు ఏమైనా ఉన్నాయో లేదో పరిశీలిస్తునట్లు పేర్కొన్నారు.