News July 7, 2024

ఇసుక ప్రైవేటుగా విక్రయిస్తే చర్యలు: జిల్లా అధికారి

image

పల్నాడు జిల్లాలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం చేపడుతున్నట్లు గనులు భూగర్భ శాఖ జిల్లా అధికారి నాగిని తెలిపారు. నరసరావుపేటలోని జిల్లా కార్యాలయంలో ఆమె శనివారం మాట్లాడుతూ.. కృష్ణానది సమీప యార్డుల్లో నిల్వ చేసిన ఇసుక టన్ను రూ.191.52గా ఉన్నతాధికారులు నిర్ణయించారన్నారు. అయితే ఎక్కడైనా ఇసుక ప్రైవేటుగా విక్రయించినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News September 30, 2024

లడ్డూలా దొరికిపోయిన బాబు: అంబటి రాంబాబు

image

తిరుమల లడ్డూ వివాదంపై కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను నేడు సుప్రీం కోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘లడ్డు ప్రసాదం విషయంలో రాజకీయ ఆరోపణలు చేసి లడ్డులా దొరికిపోయిన బాబు!’ అంటూ ట్విట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

News September 30, 2024

US కాన్సులేట్ ప్రతినిధులతో మంత్రి అనిత సమావేశం

image

రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత హైదరాబాద్ నానక్ రామ్ గుడ లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయ ప్రతినిధులతో సోమవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుపై హోం మంత్రి చర్చించారు. అమెరికా వెళ్లాలనుకునే వారు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని అన్నారు. వీసా అప్లికేషన్ సిస్టం సులభతరం చేయవలసిందిగా హోమ్ మంత్రి కోరగా యూఎస్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారన్నారు.

News September 30, 2024

గుంటూరు: నేటి నుంచి ఇళ్లకు ఉచిత ఇసుక

image

గృహాలు నిర్మించుకునే వారికి సోమవారం నుంచి గంగా ఇసుక అందుబాటులో ఉండనున్నట్లు కలెక్టర్ లక్ష్మీ తెలిపారు. పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని నగదు చెల్లించి అప్లై చేసుకున్న వారికి ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పారు. సొంత వాహనం కలిగిన వారికి స్లాట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. వాహనం లేని వారికి ప్రభుత్వమే సమకూరుస్తుందని, వినియోగదారులు రవాణా చార్జీలు చెల్లించి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు.