News July 7, 2024
భారత సరిహద్దులో డ్రాగన్ బంకర్ల నిర్మాణం

చైనా మరోసారి భారత్ను కవ్వించే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తూర్పు లద్దాక్లోని ప్యాంగ్యాంగ్ సరస్సు చుట్టుపక్కల అండర్ గ్రౌండ్ బంకర్లు నిర్మిస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా కనిపిస్తోంది. ఆయుధాలు, ఇంధనం, సైనిక వాహనాల కోసం చైనా ఈ ఆర్మీ బంకర్లు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. యూఎస్కు చెందిన బ్లాక్ స్కై సంస్థ అందించిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం బయటపడింది.
Similar News
News February 4, 2026
చిక్కుల్లో ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం

ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ పబ్లిష్ కాని ఈ బుక్ కాపీ రాహుల్ గాంధీ చేతిలో కనిపించడంతో వివాదం మరింత ముదిరింది. చైనాతో ఉద్రిక్తతలపై ఇందులో రాశారని రాహుల్ ఆరోపిస్తున్నారు. ప్రచురించని పుస్తకంలో ఉన్న వాటిని లేవనెత్తడం దేశ భద్రతకు ముప్పని కేంద్రం అంటోంది. రక్షణ శాఖ అనుమతులు రాకపోవడంతో 2023 నుంచి ఇది ప్రచురణ కాలేదు.
News February 4, 2026
U19 WC: భారత్ రికార్డు

అండర్-19 మెన్స్ వరల్డ్ కప్లో భారత్ డామినేషన్ కొనసాగుతోంది. టీమ్ ఇండియా ఫైనల్ చేరడం U19 WC చరిత్రలో ఇది పదో సారి. దీంతో మొత్తం 16 ఎడిషన్లలో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇవాళ SF-2లో AFGపై 311 పరుగులు ఛేదించగా, U19 WC హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ సక్సెస్ఫుల్ రన్ ఛేజ్. మరోవైపు వరుసగా 6 ఎడిషన్లలో (2016, 18, 20, 22, 24, 26) భారత్ ఫైనల్ చేరడం విశేషం.
News February 4, 2026
‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

AP: ‘మనమిత్ర’ పేరుతో ప్రభుత్వం తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్కు ఆదరణ పెరుగుతోంది. 50 లక్షల మంది దీని ద్వారా సేవలందుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 900 సేవలందిస్తుండగా త్వరలోనే 1000కి పెంచనున్నారు. పాస్ పుస్తకాలు, ఆలయ సేవలు, బస్ టికెట్ల బుకింగ్, పన్నులు, బిల్లుల చెల్లింపులను ఈ యాప్తో చేసేయొచ్చు. 9552300009 నంబర్తోని ఈ యాప్ ప్రతి ఇంటి చిరునామాగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.


