News July 7, 2024

KNR: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఓవ్యక్తి మృతి చెందాడని కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాలు.. కేశవపట్నం మండలం గడ్డపాకకు చెందిన చిత్తారి రత్నం సుభాష్‌నగర్‌లో అద్దెకు ఉంటూ కరెంట్ పోల్స్‌ సబ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. అర్దరాత్రి అతడి నోట్లో నురుగులు రావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. మృతుడి సోదరుడు రాజు ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News March 9, 2026

ప్రజావాణికి 352 దరఖాస్తులు: కలెక్టర్ చిత్రా మిశ్రా

image

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి, గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి 352 దరఖాస్తులను స్వీకరించారు. వృద్ధులు, దివ్యాంగుల వద్దకే వెళ్లి స్వయంగా వినతులు స్వీకరించిన కలెక్టర్.. సమస్యలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు స్పష్టం చేశారు.

News March 8, 2026

కరీంనగర్‌లో రేపు 2కే రన్

image

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో MCK నుండి అంబేద్కర్ స్టేడియం వరకు రేపు ఉదయం 6.30 2K రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్పొరేషన్ లో E-వేస్ట్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని, ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

News March 8, 2026

కరీంనగర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ప్రజావాణి కార్యక్రమానికి, జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తమ స్థానంలో ఇతర అధికారిని డిప్యూట్ చేయాలని, ప్రజల నుండి వచ్చే ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడం ప్రతి అధికారి బాధ్యత అని తెలిపారు.