News July 7, 2024
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పుస్తకం

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ రాష్ట్ర సభ్యుడు డా.తవ్వా వెంకటయ్య ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితంపై పుస్తకం రచించారు. ‘ఓ ధీరుడి పయనం సమరం నుంచి సంక్షేమం వైపు’ అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ పులివెందులలోని తమ స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటయ్య చేసిన కృషిని కొనియాడుతూ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
Similar News
News March 14, 2026
మహిళ ఆత్మహత్య వీడియో వైరల్.. స్పందించిన సజ్జనార్

కళ్లెదుటే <<19370480>>భార్య ప్రాణాలు<<>> తీసుకుంటుంటే.. అడ్డుకొని కాపాడాల్సిన భర్త హేళన చేస్తూ వీడియో తీయడం అత్యంత విచారకరం. సమాజానికి సిగ్గుచేటని HYD సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ట్వీట్ చేశారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజమని, పంతాలకు పోయి ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయేదాకా కెమెరా పట్టుకుని చోద్యం చూడడం పైశాచికత్వం అని పేర్కొన్నారు. దయచేసి బంధాలకు విలువనివ్వాలని, క్షణికావేశంలో ఇలా చేస్తే ఆపాలన్నారు.
News March 14, 2026
కడప: 10th పబ్లిక్.. ఎగ్జామ్ సెంటర్ గుర్తించండిలా.!

కడప (D)లో ఈ నెల 16 నుంచి 10th పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా విద్యార్థులకు ప్రభుత్వం ఓ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్ష కేంద్రాలను గుర్తించడంలో ఇబ్బందులు లేకుండా హాల్ టికెట్లో QR కోడ్ను ముద్రించారు. దీనిని ఫోన్లో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్ ఫొటోలు కనిపిస్తాయని కడప జిల్లా DEO షంషుద్దీన్ తెలిపారు. మరింత సమాచారం కోసం <<19371473>>ఇక్కడ క్లిక్ చేయండి.<<>>
News March 14, 2026
కడప జిల్లా: ఒక్కరోజులో 281 మందిపై కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 281 కేసులు నమోదు చేశారు. వారికి సంబంధించి రూ.53,390 జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనంలో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్టు తప్పక ధరించాలన్నారు. లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నచికేత్ హెచ్చరించారు.


