News July 7, 2024
జడ్చర్ల: చోరీకి వెళ్లి పోలీసులకు దొరికారు

చోరీకి వెళ్లిన ఇద్దరు దొంగలు పోలీసులకు చిక్కిన ఘటన పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం జరిగింది.యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాలు.. జడ్చర్ల మండలం పెద్దఆదిరాలకు చెందిన బరిగల శివకుమార్(23), మల్కాజిగిరిలో ఉంటున్న పవన్(24)లు పాత నేరస్థులు. చౌటుప్పల్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా కత్తులతో దాడి చేసేందుకు యత్నించారు. విచారించగా చోరీ చేసేందుకు వెళ్తున్నట్లు ఒప్పుకున్నారు.
Similar News
News January 27, 2026
పాలమూరు: పేపర్లలో తప్పులుంటే అధికారులకు తెలపాలి: VC

పాలమూరు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మూడో సెమిస్టర్ పరీక్షా కేంద్రాలను మంగళవారం ఉపకులపతి (VC) శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 27, 2026
MBNR: పెరిగిన ఉష్ణోగ్రతలు.. తగ్గుతున్న చలి

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాజాపూర్లో అత్యల్పంగా 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మూడు రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగాయి. జడ్చర్ల, మిడ్జిల్లో 15.1, భూత్పూర్లో 16.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రథసప్తమి ముగియడంతో ఇకపై ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
News January 26, 2026
మహబూబ్నగర్: పరేడ్ మైదానంలో పతాకావిష్కరణ

మహబూబ్నగర్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. కలెక్టర్ విజయేందిర బోయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ అమలు స్ఫూర్తితో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.


