News July 7, 2024
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాపాడాలి: సీఐటీయూ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాపాడాలని సీఐటీయూ నాయకుడు గొర్లి వెంకటరమణ అన్నారు. జులై 10న జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో ధర్నాలు చేయాలన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు కార్మిక హక్కులను కనీసం పట్టించుకోవడంలేదన్నారు. హక్కులను కాపాడే వరకు నిరసన తెలుపుతామని హెచ్చరించారు.
Similar News
News March 13, 2026
VZM: ‘అక్షరాంధ్ర పరీక్షకు 99% హాజరు కావాలి’

ఈనెల 15న నిర్వహించనున్న అక్షరాంధ్ర ఫైనల్ పరీక్షకు 99% హాజరు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం టెలీకాన్ఫిరెన్స్ ద్వారా పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో 1.10 లక్షల మందిని అక్షరాంధ్ర కింద గుర్తించామని, వారందరూ అక్షరాస్యులుగా మారాలని అన్నారు. పరీక్ష అనంతరం మూల్యాంకనం చేసి మార్కులను యాప్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు.
News March 13, 2026
15న పారాది రానున్న వైఎస్.షర్మిల

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షరాలు వైఎస్.షర్మిల ఈనెల 15న బొబ్బిలి మండలం పారాది రానున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ చెప్పారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా ఆదివారం పారాదిలో రచ్చబండ నిర్వహిస్తారని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని, షర్మిల రచ్చబండను జయప్రదం చేయాలని కోరారు.
News March 13, 2026
VZM: RRB గ్రూప్-D పరీక్షలకు ఫ్రీ కోచింగ్

విజయనగరం జిల్లాలో రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నారు. RRB గ్రూప్-D పరీక్షలకు 2 నెలల శిక్షణతో పాటు స్టైఫండ్ ఇస్తారు. టెన్త్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేయనున్నారు. అర్హులు తమ బయోడేటా, టెన్త్ మార్కుల లిస్ట్, క్యాస్ట్, ఇన్కమ్, తదితర ధ్రువపత్రాలతో కస్పా హైస్కూల్లో గల BC స్టడీసర్కిల్ కార్యాలయానికి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.


