News July 7, 2024

పిడుగుల పాటుకు 10 మంది మృతి

image

బిహార్‌ను పిడుగుల వర్షాలు వణికిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో ఆ రాష్ట్ర వ్యాప్తంగా పిడుగు పాటుకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల్లో పిడుగులు పడి దాదాపు 40మంది మృతిచెందడం గమనార్హం. ప్రకృతి వైపరీత్యంతో సంభవించిన ఈ ఘటనల్లో మృతుల కుటుంబాలకు సీఎం నీతీశ్ కుమార్‌ ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు.

Similar News

News September 2, 2024

వాగులో చిక్కుకున్న గ్రామస్థులు

image

TG: నల్గొండ జిల్లా గోనబోయినపల్లి వద్ద గ్రామస్తులు వాగులో చిక్కుకున్నారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో 10 మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. బాధితులు డిండి(మ) దెయ్యం గుండ్లకు చెందిన వారిగా గుర్తించారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

News September 2, 2024

భారత జట్టుకు సూర్య దూరం?

image

బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడుతూ గాయపడ్డ భారత ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ రౌండ్‌కు దూరమవనున్నారు. SEP 5 నుంచి ప్రారంభం అయ్యే ఈ ట్రోఫీలో ప్రదర్శనల ఆధారంగా బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు జట్టును BCCI ఎంపిక చేయనుంది. సీనియర్లు కాక భారత జట్టులో చోటు ఆశిస్తున్న వారు ఈ ట్రోఫీ ఆడుతున్నారు. దీంతో SKY భారత జట్టుకు దూరమయ్యే ఛాన్సుంది. సెప్టెంబర్ 19 నుంచి BANతో టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది.

News September 2, 2024

ఏపీలో భారత క్రికెటర్ల సందడి

image

అనంతపురంలో భారత క్రికెటర్ల రాకతో సందడి వాతావరణం నెలకొంది. ఈ నెల 5 నుంచి దులీప్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, తుషార్ దేశ్ పాండే తదితర ప్లేయర్లు బస్సులో బెంగళూరు నుంచి అనంతపురం చేరుకున్నారు. తొలి మ్యాచ్ ఆర్టీడీ మైదానంలో 5న ఇండియా సీ, డీ జట్ల మధ్య జరగనుంది. ఆటగాళ్లకు అలెగ్జాండర్ త్రీస్టార్ హోటల్‌లో వసతి ఏర్పాటు చేశారు.